Thovva web news.04 Dec.Wed 7;30 Am


ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం భూమి కంపించింది. ఉమ్మడి జిల్లాలోని ములుగు మేడారం తాడ్వాయి మహబూబాబాద్ జిల్లా లోని జమండ్లపల్లి కంబలపల్లి గ్రామాల్లో భూమి ఒక్కసారిగా కంపించినట్టు ప్రజలు తెలిపారు ఉదయం ఇంకా జనం నిద్ర లేవకముందే పడుకున్న మంచాలూ వంటి ఇంటిలో సెల్ఫ్ లో వున్న వంట పాత్రలు కింద పడ్డాయి ఏమి జరుగుతుందో నని త జనాలు బెంబేలు పడ్డారు. దీనిపై వరంగల్ జిల్లా అధికారులను సంప్రదించగా ప్రజలు ఫోన్ ద్వారా తమకు సమాచారం అందించారని రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3 నమోదు అయినట్టు అధికారులు తెలిపారు వాతావరణంలో జరుగుతున్న మార్పులకు భూమిపై ప్రక్కపనలు ఎదురయ్యే అవకాశం వుందని అధికారులు పర్యావరణవేత్తలు తెలిపారు.ఎది ఏమైనా పెను ప్రమాదం తప్పిందని ప్రజలు ఉపరిపిల్చుకున్నారు.
