సంక్షేమ పథకాలను ప్రజల ముంగిడికి తీసుకు వచ్చాం….
పాల్గొన్న ఎమ్మెల్సీ దండే విఠల్,గిరిజన సంక్షేమ శాఖ ఛైర్మెన్ కొట్నక్ తిరుపతి, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్.
Thovva web news. // 08, DEC Sun 6,PM

ప్రజాపాలన విజయోత్సవ వేవేడుకలుిర్పూర్ నియోజక వర్గం బెజ్జూరు మండల కేంద్రంలోని యస్.వి ఫంక్షన్* హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ శ దండే విఠల్ ,గిరిజన సంక్షేమ శాఖ ఛైర్మెన్ కొట్నాక్ తిరుపతి , డిసిసి అధ్యక్షుడు విశ్వప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు సరైన పాలన అందుతుంది..రాష్ట్రంలో అట్టహాసంగా ఏడది పూర్తిచేసుకొని విజయోత్సవాలు జరుగుతున్నాయి అన్నారు.నిరుపేదల అభ్యున్నతి కోసం ప్రజా ప్రభుత్వం ప్రతిక్షణం కృషి చేస్తున్నది.ఎడది ప్రజా పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అని ఆయన అన్నారు.త్వరలోనే నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది. అర్హులను గుర్తించటానికి జిల్లా పాలనాధిరి సారథ్యం లో సర్వే జరుగుతుంది.రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో అమలు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానికి దక్కుతుంది.సంక్రాంతి తరవాత రైతులకు రైతు భరోసా ఇస్తామన్నారు ప్రజా ప్రభుత్వంలో శస్త్ర చికిత్సల కోసం ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది అని మహిళలకు ఉచిత బస్ ప్రయాణం,రూ.500 కి గ్యాస్ సిలెండర్,200 యూనిట్ ఉచిత విద్యుత్, సన్నం వడ్లు కింటకు 500 బొనస్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను సీఎం సారథ్యంలో ప్రజా ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తుంది.ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించటం జరిగింది.. డీఎస్సి ద్వారా కొత్త టీచర్లు వచ్చారు..విద్యార్థులకు మెస్ చార్జీలు పెరిగాయి, కాస్మెటిక్ చార్జీలు పెరిగాయని దీంతో మెరుగైన నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందుతుందినీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మాటకి కట్టుబడి ప్రతి ఒక్క పథకాన్ని క్రమ శిక్షణగా అమలు చేస్తుంది అన్నారు.ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణలో భూసంస్కరణలు అమలయ్యాయి అన్నారు.సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందించటం జరిగింది.ప్రతిక్షణం ప్రజల పక్షాన నిలబడి ప్రజా శ్రేయస్సే పరమావధిగా ప్రజా ప్రభుత్వం విజయవంతంగా పనిచేస్తుంది అని . ఈ కార్య క్రమంలో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

