ప్రమాదం అంచున రజలిపేట చెరువు కట్ట….
భారీ వర్షాలకు సగం కొట్టుకుపోయిన కట్ట రోడ్డు…
3నెలలు దాటిన మోక్షం లేదు…..
నిద్రణంగా వ్యవహరిస్తున్న అధికారులు…. ప్రజా ప్రతినిధులు….
Thovvawebnews.in//.11Dec wed.10;30.p.m

జిల్లా లో గత ఆగస్టు నెలాఖరులో కురిసిన భారీ వర్షాలకు తెగిపోయిన రోడ్లు చెరువు కట్టల కాజ్ వే బ్రిడ్జి లు తక్షణం మరమ్మత్తు చేయాలని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు.మహబూబాబాద్ వర్షాభావంతో దెబ్బతిన్న ప్రాంతాన్ని సందర్శించి సీఏం జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష చేసి నిధులు మజురుచేసిన అధికారులు ప్రజా ప్రతినిధులు తూ తూ మంత్రంగా కొన్ని తెగిన రోడ్లను ఎర్రమట్టి తో పూడ్చి ఏదో చేశాం అనే విధంగా పనులు పూర్తిచేశారు. ఇప్పటికీ కొన్ని ప్రమాదకర స్థితిలో వున్న రోడ్లు కనీసం రోడ్డు కొట్టుకుపోయి 3 నెలలు దాటినా నేటికీ పట్టించుకో క వడం ప్రభుత్వ పనితీరుకు నిధర్శం ఆంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. జిల్లా కేంద్రంలోని వీలిన గ్రామం రజలీపేట చెరువు కట్ట రోడ్డు నిదర్షంగా కనిపిస్తుంది. మహబూబాబాద్ రజలిపేట రోడ్డు చెరువు కట్ట రోడ్డు సుమారుగా 60 శాతం పైగా కట్ట కొట్టుకుపోయిన ఇప్పటికీ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం నిధులు మంజూరైన ఎందుకు పనులు చేయలేదో ….వచ్చిన నిధులను మాయం చేసి … కట్టను గాలికి వదిలేశారో దేవుడికే తెలియాలి… ఏదైనా ప్రమాదకరం గా మాత్రం చెరువు కట్ట కనిపిస్తుంది.
ఆదమరిస్తే …హరి.. ఈ.
మహబూబాబాద్ కురవి నేషనల్ హైవే నుంచి రాజలిపేట మంగలి కాలనీ పత్తిపాక మహబూబాబాద్ కలిపే ప్రధాన రజాలి పేట వూరు చెరువు కట్ట పూర్తిగా ధ్వంసం అయి సుమారు రెండు చోట్ల 60 నుంచి 100 మీటర్ల మేర పెద్ద గండి పడి అగాధంగా కనిపిస్తుంది రాత్రి పూట కానీ పగలు కానీ ద్విచక్ర వాహనాలు అరొడ్డు పై వెళ్ళాలంటే సాహసం తో కూడుకున్న పనే .. కొంచెం అటు ఇటు అయితే ప్రాణాలు పోవాల్సిందే ఇప్పటికే ఇద్దరు ముగ్గురు ద్విచక్ర వాహన దారులు అ గుంతలో పడి చేతులు కాళ్ళూ విరిగిపోయాయి… రోజూ రోజు కి రోడ్డు కుంగి పోతు ఏ క్షణం లో నైన చెరువు కట్ట తెగి పోయే ప్రమాదం లేకపోలేదు కట్ట తెగిన చెరువు నీరు వూరులోకి అటు నేషనల్ హైవే పైకి వచ్చే ప్రమాదం లేకపోలేదు.నిత్యం అదే రోడ్డు నుంచి ఎక్కువ మంది రైతులు విద్యార్థులు ప్రయాణం సాగిస్తున్నారు .వెంటనే రోడ్డు మరమ్మత్తు చేయక పోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
తక్షణమే రోడ్డు పనులు పూర్తి చేయాలి…..
ధారా ఇందూ భారతి….
భాజపా జిల్లా అధికార ప్రతినిధి.
గతః ఆగస్టులో గండి పడి ప్రమాదం అంచున వున్న రాజాలిపేట చెరువు కట్ట మహబూబాబాద్ రజాలిపేట ప్రధాన రహదారి రోడ్డు వేయక పోవడం రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన దాష్టీకం కు నిదర్శనం అని సుమారు మూడు నెలలు దాటినా ఈ రోడ్డు పై అధికారులకు ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోకపోవడం ఎంటి అని ప్రమాదం అంచున వున్న చెరువు కట్టపై నిత్యం వందల మంది ప్రయాణిస్తారు… ఎక్షణం ఏమవుతుందో అని ప్రాణాలు అరచేతిన పెట్టుకొని ప్రయాణం చేయాల్సి వస్తుంది వెంటనే తక్షణం ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.