Thovva web news.in//26/12/2024

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. అస్వస్థతతో గురువారం సాయంత్రం దిల్లీ ఎయిమ్స్లో చేరిన ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచినట్టు ఎయిమ్స్ ప్రకటన విడుదల చేసింది.ఇప్పటికే పలువురు నేతలు . చేరుకున్నారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఎయిమ్స్కు చేరుకున్నారు.మన్మోహన్ సింగ్ అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహా రావు ప్రధానిగా ఉన్న సమయంలో, ఆర్థిక మంత్రిగా పని చేశారు మన్మోహన్ సింగ్. ఆ సమయంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ వంటి అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ప్రపంచానికి భారత్ ఆర్థిక వ్యవస్థను ఓపెన్ చేశారు. యూపీఏ ప్రభుత్వంలో 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా సేవలందించారు. ఆయన హయాంలో ఆర్థిక పరంగా భారత్ మంచి విజయాలు సాధించింది. దేశాన్ని సుదీర్ఘకాలంపాటు పాలించిన ప్రధానుల్లో మన్మోహన్ సింగ్ ఒకరిగా నిలిచారు. దేశంలో ప్రతి పౌరుడుకి ఆహార భద్రత కావాలని జాతీయ ఉపాధి పథకం ప్రారంభించిన ఘనత ఆయనకే దక్కుతుంది అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం నుంచి కాకుండా రెండుసార్లు ప్రధాని పదవి తగ్గించుకున్న ఘనత కూడా ఆయన సొంతం. ఆయన మరణం తీరని లోటని ఇతర నేతలు సందేశం విడుదల చేశారు.
మాజీ ప్రధాని విశేషాలు.
పుట్టిన తేదీ: 26 సెప్టెంబరు 1932
జన్మస్థలం: మా, పంజాబ్ (ప్రస్తుతం పాకిస్థాన్లో ఉంది)
వివాహం: 14 సెప్టెంబరు 1958
కుటుంబం: భార్య గురుశరణ్ కౌర్, కుమార్తెలు ఉపేందర్, దామన్ అమృత్
చదువు: పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో 1952లో బీఏ, 1954లో ఎంఏ పట్టా
కేంబ్రిడ్జ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో ట్రైపోస్
ఆక్స్ఫర్డ్ నుంచి ఎం.ఎ. డి.ఫిల్ (1962)
హోనరిస్ కాసా నుంచి డి.లిట్
అలరించిన పదవులు
దేశ 13వ ప్రధానిగా మన్మోహన్ సింగ్ సేవలందించారు. 2004-2014 మధ్య భారత ప్రధానిగా మన్మోహన్సింగ్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత పాకిస్థాన్లోని పంజాబ్లో 1932 సెప్టెంబర్ 26న మన్మోహన్ సింగ్ జన్మించారు. విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్కు వచ్చింది. మన్మోహన్ 1982-85 మధ్య ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు. 1991-96 మధ్య పీవీ హయాంలో ఆర్థికమంత్రిగా ఉన్నారు. ఆర్థికమంత్రిగా ఎల్పీజీ సంస్కరణలు ప్రవేశపెట్టారు. 1998-2004 మధ్య రాజ్యసభ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. సుమారు 33 ఏళ్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. అంతేకాకుండా యూజీసీ ఛైర్మన్గానూ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్గానూ సేవలందించారు డాక్టర్ మన్మోహన్ సింగ్.
ఆయన కీర్తి ప్రతిష్టలు
మన్మోహన్ ప్రతిరోజు 18 గంటలపాటు అవిశ్రాంతంగా పనిచేసేవారు. భారత ఆర్థిక వ్యవస్థ పునాదులను శక్తిమంతంగా తీర్చిదిద్దారు. దశాబ్ద పాలనలో చిరస్మరణీయ విజయాలు అందుకున్నారు. 2005లో విప్లవాత్మక సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. 2005లో ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. మన్మోహన్ హయాంలోనే అత్యధిక జీడీపీ(10.8శాతం) వృద్ధిరేటు నమోదు చేసి రికార్డు సాధించింది. మన్మోహన్ హయాంలోనే వెనుకబడిన వర్గాలకు 27 శాతం సీట్లు కేటాయింపు జరిగింది. ప్రధాని పీఠాన్ని అధిష్టించిన తొలి హిందూయేతర వ్యక్తిగా మన్మోహన్ రికార్డు సృష్టించారు.
పురస్కారాలుమన్మోహన్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1987లో పద్మవిభూషణ్ ప్రదానం చేసింది. 2017లో మన్మోహన్ సింగ్ను ఇందిరా గాంధీ బహుమతి వరించింది. 1993, 94 ఉత్తమ ఆర్థికమంత్రిగా యూరో మనీ అవార్డు అందుకున్నారు మన్మోహన్. 2010లో ఆయనకు వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డు వచ్చింది. ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతుల జాబితాలోనూ మన్మోహన్కు చోటు కూడా దక్కించుకున్నారు.
సంతాప సందేశం
ప్రధాని మోడీ సంతాపం
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మృతిపట్ల ప్రస్తుత ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. దేశం విశిష్ట నాయకుడిని కోల్పోయిందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై మన్మోహన్సింగ్ చెరగని ముద్ర వేశారని కొనియాడారు.

ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు విశేషంగా కృషి చేశారన్నారు.”దేశం దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది. మన్మోహన్ ఆర్థిక విధానాలు దేశంలో పేదరికాన్ని తగ్గించింది. మన్మోహన్ను దేశం ఎప్పుడూ కృతజ్ఞతతో గుర్తుపెట్టుకుంటుంది”– మల్లికార్జున ఖర్గే , కాంగ్రెస్ అధ్యక్షుడు

అజాత శత్రువు..
‘“మాజీ ప్రధాన మంత్రి, ఆర్థికవేత్త శ్రీ మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు. దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడు, భారత రాజకీయాలలో నిష్ణాతుడు, ప్రజా సేవలో తన విశేషమైన ప్రజ్ఞ ప్రదర్శించారని , ఆయన అణగారిన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పరితపించారనీ అజాత శత్రువుగా అభివర్ణించారు . పార్టీలకు అతీతంగా ఆయన నాయకత్వం అభిమానాన్ని, గౌరవాన్ని పొందిందనీ . శ్రీ మన్మోహన్ సింగ్ వారసత్వం దేశ నిర్మాణ సాధనలో తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నానుఅని భాజపా అధ్యక్షుడు కేంద్ర మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డ తన శాంతి సందేశం వెల్లడించారు
చిరకాలం మదిలో వుంటారు.
“మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణవార్త విని నేను చాలా బాధపడ్డాను. ఆయన కుటుంబ సభ్యులకు, ప్రియమైన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మా జాతికి మీరు చేసిన సేవకు ధన్యవాదాలు. మీ ఆర్థిక విప్లవానికి మీరు ఎప్పటికీ గుర్తుండిపోతారు. దేశానికి మీరు ప్రగతిశీల మార్పులుతీసుకువచ్చారు.”–
రాబర్ట్ వాద్రా, కాంగ్రెస్ నేత




