Thovva web news. 08 feb sun,

భద్రాద్రి రాముడికి ప్రతి ఏటా సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవానికి గోటి తలంబ్రాలు తయారు చేయుటకు శ్రీరామ భక్తులు సర్వసన్నద్దమై భక్తి శ్రద్ధలతో తలంబ్రాలను తయారు చేస్తారు.దానిలో భాగంగా ఆదివారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని శ్రీ రామచంద్ర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రాజమండ్రి నుంచి భద్రాద్రి రాముడికి ప్రత్యేక నిర్వహణలో సాగు వడ్లను , శోభయాత్రతో తీసుకువచ్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి కార్యక్రమానికి ఉపక్రమించారుఈ సందర్బంగా ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శన చార్యులు మాట్లాడుతూ తలంబ్రాలను ప్రతి సంవత్సరం తయారు చేయడం జరుగుతుందని,.వడ్లను గోటితో వొలిచి తలంబ్రాలను శుధ్ధ కరణతో శ్రీరామ,జయ రామ, నామ స్మరణ జపం చేస్తూ తయారు చేయాలని రామ భక్తులను కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చక కమిటీ సభ్యులు పెద్దినేని వెంకటేశ్వరరావు,కృష్ణ రెడ్డి, కొల్లా వెంకటేశ్వరావు,సత్తిబాబు,తిరుపతి,వైఎస్ దంపతులు, పగడాల.శ్రీనివాస్,సుమన్,జంపన్న,ఎల్లవుల మల్లయ్య, కొల్లా బోస్, చందా రామకృష్ణ,తదితరులు పాల్గొన్నారు
