-సర్వర్ డౌన్, వరుస సెలవుల సమస్యలతో తప్పని ఇబ్బందులు
-గడువు పెంచాలని సిపిఐ(ఎం) పార్టీ డిమాండ్
తొవ్వ; గార్ల(ఏప్రిల్13)
రాజీవ్ యువశక్తి పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దరఖాస్తులకు ప్రభుత్వం అవకాశం కల్పించడం శుభ పరిణామం.కానీ ఈ దరఖాస్తు తుది గడువు ఈ నెల 14వ తేదీన ముగుస్తుండడంతో సగం మంది దరఖాస్తు చేసుకోకుండానే ఈ పథకానికి అనర్హులుగా మిగిలిపోయే అవకాశం ఉందని వెంటనే గడువు తేదీని పొడిగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటన లో అధికారులను కోరారు. గత కొన్ని రోజులుగా రాజీవ్ యువశక్తి ఓబిబిఎంఎస్ వెబ్ సైట్లు లలో సాంకేతిక సమస్యతో అనేక మంది దరఖాస్తు చేసుకోకుండానే ఆన్ లైన్ సెంటర్ లకు వచ్చి వెనుదిరిగిపోతున్నారని దీనికి తోడు వరుసగా ప్రభుత్వ సెలవులు రావడంతో దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. వరుసగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో రెవెన్యూ నుంచి పొందాల్సిన ధృవీకరణ పత్రాలను దరఖాస్తుదారులు పొందలేకపోవడంతో దరఖాస్తుదారులు గడువు తేదీ దగ్గర పడుతున్న కొద్ది ఆందోళన చెందుతున్నారని గడువు తేదీని పొడిగించాలని కోరారు.
