రాజకీయ పక్షాలు ప్రలోభాలు పెడితే చర్యలు తప్పవు
జిల్లా అంత “144”సెక్షన్ అమలు ….
పోలింగ్ బూత్ ల వద్ద పటిష్టమైన భద్రత .
విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ శశాంక .ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్...
తొవ్వ న్యూస్.ఇన్ // కంట్రిబ్యూటర్ డి. వెంకన్న .కెమెరామన్ యాకుబ్
జిల్లా లో జరుగుతున్న రెండు శాసన సభ నియోజకవర్గాలైన డోర్నకల్ మహబూబాబాద్ లలో ఎన్నికలు సజావుగా జరగడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నామని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి పోలింగ్ 100% నిర్వహించేందుకు పకడ్బందిగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ శశాంక ఎస్పీ సంగ్రామ్ గణపతి రావు పాటిల్ సంయుక్తంగా తెలియజేశారు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడిఓసి భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని రెండు నియోజకవర్గాలైన డోర్నకల్ మహబూబాబాద్ లో ఎన్నికలు నిర్వహించడానికి అధికారులను సమయత్తం చేయడం జరిగిందని డోర్నకల్ శాసన సభలో 12 మంది బరిలో ఉన్నారని అదేవిధంగా మహబూబాబాద్ కు 14 మంది అభ్యర్థులుగా ఉన్నారని డోర్నకల్ 2,19264 మంది ఓటర్లు ఉండగా మెహబూబాబాద్ లో 2,53,342 మంది ఓటర్లు ఉన్నారని దీనిలో పిడబ్ల్యుడి కింద 12 961 మంది 80 సంవత్సరాలు పైబడిన ఓటర్లు 6601 గుర్తించడం జరిగిందన్నారు. మొదటిసారి ఓటును వినియోగించుకునే ఓటర్లు 19 578 మంది ఉన్నారని అన్నారు జిల్లాలో పోలింగ్ సరళిని అధికారులు పర్యవేక్షించి ఓటర్లకు ఎటువంటి సమస్యలు రాకుండా చూస్తామని అన్నారు పోలింగ్ స్టేషన్లో వద్ద ప్రజలు గుంపులుగా ఉండొద్దని నేటి సాయంత్రం నుంచి ప్రచారం ముగిసిందని ఆయ నియోజకవర్గంలో స్థానికేతర్లు ఎవరు మరో నియోజకవర్గంలో ఉండకూడదని గుంపులుగా ప్రజలు గుమ్మికూడావద్దని ఎటువంటి పార్టీల మీటింగులు పెట్టకూడదని జిల్లా అంతటా 144 సెక్షన్ అమలవుతుందన్నారు జిల్లా లో మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుండి సైలెంట్ డే గా మారిపోతుందని అభ్యర్థులువారి అనుచరులు సోషల్ మీడియాలో కూడ పార్టీలకు సంబంధించి పోస్టింగ్లు పెట్టకూడదని అన్నారు ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ నడుస్తుందన్నారు మాహబూబాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల సామగ్రిని ట్రైబల్ వెల్ఫీర్ స్కూల్ నందు ఇవ్వడం జరుగుతుందని డోర్నకల్ లో సెయింట్ అగస్టీన్ పాఠశాలలో జరుగుతుందని ఎస్పీ కలెక్టర్ తెలిపారు జిల్లాలో ఎన్నికల నోటిఫికేషన్ నుంచి నేటి వరకు 96 కేసులు నమోదు చేశామని అందులో అక్రమ మద్యం బెల్లం డబ్బులు గంజా లాంటివి ఉన్నాయని తెలిపారు . ఎన్నికల వేళా రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురిచేస్తే ప్రజల దృష్టికి వస్తే వెంటనే ఎన్నికల అధికారులకు తెలుపాలన్నారు.ఓటర్లు అంత శాంతియుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు
