మహబూబాబాద్ లో డోర్నకల్ లో డాక్టర్ల “హస్త”వాసి”
తొవ్వ న్యూస్ .ఇన్ //:
జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం చూపింది.. గిరిజన కోట అయిన మహబూబాబాద్ డోర్నకల్ రెండు నియోజకవర్గాలో ఇద్దరు డాక్టర్లు “హస్త”వాసి చూపించారు మహబూబాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మురళి నాయక్ బి అర్ ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ పై 20 వ రౌండ్ల్ లో 49232 మెజారిీతో..విజయంసాధించారు ..డోర్నకల్ లో రాజకీయ కురువృద్ధుడు డీఎస్ రెడ్యానాయక్ (బి ఆర్ ఎస్ ) పై డాక్టర్ రాంచందర్ నాయక్ (కాంగ్రెస్) 19 వ రౌండ్ ముగిసే సరికి 52704 ఓట్ల ఆధిక్యత ప్రదర్శించారు కౌంటింగ్ సెంటర్ల వద్ద భారీగా చేరిన కార్యకర్తలు కాంగ్రెస్ కంచుకోటలో గులాబీ జెండాను 10 ఏండ్ల తర్వాత పెకిలించడం తో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి రెండు నియోజకవర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భుజాలపై మోసుకొని వెళ్లి కౌంటింగ్ సెంటర్ వద్ద కోలాహలం సృష్టించారు . ఇంకా డోర్నకల్ విషయానికి వస్తే అపార రాజకీయ చాణుక్యుడు గా పేరుపొందిన రెడ్యా నాయక్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రత్యర్థి రాంచందర్ నాయక్ చేతుల్లో ఘోర పరాజయం పాలై అయ్యారు . 52704 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ గెలవడం తో బి అర్ ఎస్ శ్రేణులు నిర్ఘాత పోయారు ఇది కేవలం కాంగ్రెస్ విజయం మాత్రమే కాదని గురుశిష్యుల పంతం అని కాంగ్రెస్ శ్రేణులు అనుకోవడం విశేషం



