“బూర్గుల” తర్వాత “రేవంతే”
రేవంత్ ముఖ్యమంత్రి తో పాలమూరు లో సంబరాలు …
రేవంత్ రెడ్డి ప్రస్థానంపై తొవ్వ ప్రత్యేక కథనం.9398236146

“రవ్వంత” మనిషితో ఏమి చేయగలుగుతుంది మునిగిపోయిన పడవ ఎక్కి రాష్ట్రము ఈదగలడా అంటూ అటు గులాబీ పార్టీ ఇటు స్వపక్షంలోని సీనియర్లు విమర్శలు చేస్తున్న రాష్ట్ర రాజకీయాల్లో ఆయనో సంచలనంగా మారి . భవిష్యత్ నాయకులకు యువతకు మార్గదర్శకం.నిలిచి రవ్వంత కాదు రాష్ట్రమంతా నేనే అంటూ కాకలు తీరిన నాయకులకు సవాలుగా అభ్యర్థులను నిలిపి గెలిపించిన ధీరోదాత్తుడు. ఆటుపోట్లకు అదరలేదు. వైఫల్యాలకు కుంగలేదు. వెన్నుచూపని వీరత్వంతో అపజయాలనే అనుభవాలుగా, పోరాటాలనే వారధిగా చేసుకొని అనతి కాలంలోనే అశేష జనాదరణ పొందాడు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండవ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచాడు

మొదటి సారి 1952 లో జరిగిన ఎన్నికల్లో వనపర్తి నుంచి బరిలో నెగ్గి హైదరాబాద్ స్టేట్ కు బూర్గుల రామకృష్ణ రావు ముఖ్యమంత్రి కాగా అదే ఆపాలమూరు లో గెలిచి ప్రత్యేక తెలంగాణ కు రేవంత్ ముఖ్యమంత్రి కావడం విశేషం . స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా ప్రస్తానం మొదలుపెట్టి, రేవంత్ 15 ఏళ్లలోనే రాష్ట్రాన్ని నడిపించే నాయకుడిగా ఎదిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్థానంపై తొవ్వ “రవ్వంత ” కాదు రాష్ట్రమంతా …. ప్రత్యేక కథనం ..ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రస్తుత . నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో 1968 నవంబరు 8న అనుముల నర్సింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు రేవంత్ రెడ్డి జన్మించారు. వనపర్తిలో పాలిటెక్నిక్ చేసిన ఆయన కాలేజీలో చదువుకునే సమయంలో జాగృతి పత్రికలో వార్తలు రాసేవాడు చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలతో విద్యార్థి సంఘంలో చురుగ్గా ఉండేవారు. 2002లో టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్)లో కొంతకాలం పనిచేసి పార్టీని వీడి జడ్పీటీసీగా పోటీ చేసి 2006లో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. సొంతూరైన కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నా కల్వకుర్తి నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జడ్పీటీసీగా గెలుపొందిన రేవంత్ ఆరంభంలోనే సత్తా చాటారు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి రాజకీయాల్లోకి వచ్చిన అయన అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గా నిలవడం విశేషం , 2018 డిసెంబర్ లో ఆనాటి ప్రభుత్వం కూతురు వివాహం వున్నా సమయంలో కావాలనే అరెస్ట్ చేసి చర్లపల్లి లో రిమాండ్ కు తరలించి కక్ష సాదింపు చర్యలు చేపట్టింది కండ్లలో ఉబికి వస్తున్నా కన్నీటిని దాచుకొని మాటల తూటాలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే ధీరత్వం, తో గుక్క తిప్పుకోని ప్రసంగాలతో మంత్రముగ్ధుల్ని చేసే చాతుర్యం, తో నాటి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రను చేపట్టి ఆవేశపూరిత వాగ్బాణాలతో , ఆటుపోట్లకు వెన్ను చూపకుండా ఎదురొడ్డి నిలిచిన వీరత్వం, పార్టీలో చేరి పదేళ్లు కాకున్నా కాకలు తీరిన నేతలతో సాధ్యపడని లక్ష్యాన్ని ముద్దాడి శతాధిక పార్టీని అధికారంలోకి తెచ్చిన నేత..గా అనుములకు గుర్తింపు ఉంటుంది . 6 గ్యారెంటిలను ఏర్చి కుర్చీ రాష్ట్రమంతా మార్పు కావాలి అనే నినదించేలా చేసి సరికొత్త రికార్డ్ సృష్టించాడు రేవంత్


