అధికార పార్టీ వార్డ్ కౌన్సిలర్ల్ సహకారం తో కాంగ్రెస్ లేదా కమ్యూనిస్టులకు అవకాశం …
చైర్మన్ వైస్ చైర్మన్ ల తీరు తోనే ఇదంతా అంటున్న గులాభి నేతలు…
తొవ్వ న్యూస్.ఇన్//9398236146
మానుకోట మున్సిపల్ పాలక వర్గం అవిశ్వాసానికి రంగం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. ఇన్నిరోజులు గులాబీ పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో పాలించిన మున్సిపాలిటీ రాష్ట్రంలో అధికారం మారడంతో చైర్మన్. వైస్ చైర్మన్ ల పై స్వంత పార్టీ గులాబీ వార్డు కౌన్సిలర్ల సహకారం తో అవిశ్వాసం పెట్టి దించాలని చూస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం . దీనికి అంతటికి కారణం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 50 కోట్ల రూపాయల మున్సిపల్ అభివృద్ధి నిధుల పై ఎమ్మెల్యే జోక్యంతో అటు గులాభి వార్డ్ కౌన్సిలర్ల తో పాటు ప్రతిపక్ష వార్డ్ సభ్యులు కూడా ధర్నాలకు దిగడం స్వయం ప్రతిపత్తి కలిగిన మున్సిపలిటీ పై ఎమ్మెల్యే పెత్తనం ఏంటని ఆరోజుల్లో జిల్లాలో అన్ని పార్టీలో చర్చ జరిగింది. ఆనాటి ఎమ్మెల్యే కు అండగా వుంటూ చైర్మన్ ,వైస్ చైర్మన్ లు తోటి వార్డ్ కౌన్సిలర్ల అభిప్రాయాలను పట్టించుకోలేదని . గులాబీ పార్టీ వార్డు కౌన్సిలర్లు గళమెత్తి ప్రశ్నించిన వారి మాటలకూ విలువ లేకుండా చేయడం మూలానే ప్రస్తుత పరిస్థితికి కారణంగా గుసగుసలు వినిపిస్తున్నాయి ,దీనికితోడు మున్సిపల్ లో ఇంటి నెంబర్లు రగడ జరుగుతుంది . చుట్టూరా ఉన్న కాలనీలలో ఇంటి నెంబర్లు ఇవ్వడంలో అధికారులు చేయడంతో మున్సిపాలిటీలో తీర్మానం చేసి కలెక్టర్కు ఫైల్ పంపించిన అతిగతి లేక పోవడం చైర్మన్ వైస్ చైర్మన్లు కనుసనలు కొన్ని ఇంటి నెంబర్ ఇస్తున్నట్టు గుస గుస లు వినిపిస్తున్నాయి. వార్డులకు వచ్చే నిధులు సక్రమముగా అమలు కావడం లేదని . ప్రతిపక్ష వార్డు సభ్యులను వార్డులను పట్టించుకోవడంలేదని ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో అధికార పార్టీ కాంగ్రెస్ మున్సిపల్ పై అవిశ్వాసం పెట్టి దించి తామే అధికారంలోకి రావాలని యత్నం చేస్తునట్టు తెలుస్తుంది లేని యేడల తమ మిత్రపక్షం అయిన సిపిఐ కి చైర్మన్ ఇచ్చి తాము వైస్ చైర్మన్ తీసుకోవాలని ప్రయతిస్టునట్టు సమాచారం. ఏదిఏమైనా అధికారం వున్నపుడు విర్రవీగిన కొంతమంది నాయకులు కు ఇది గొడ్డలిపెట్టు లా వందని ప్రజలు చెవులు కోరుకుంటున్నారు.


