అర్ ఎస్ ఆర్ శిష్యుడిగా రంగ ప్రవేశం….
రామ “సహాయం”ఆదరణతో రాజకీయ అందలం….
తోవ్వ.న్యూస్.//9398236146..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో హరికోట్ల రవి పేరు తెలియని వారు ఉండరు. సబ్ రిజిస్టర్ గా విధులు నిర్వహించిన కాలంలో సామాన్యులతో కలిసి సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొని అంబేద్కర్. పూలే ఆశయ సాధనలో ముందున్నారు అంతే కాకుండా రాష్ట్ర ఉద్యోగ సంఘాల ప్రతినిధిగా అనేక సమస్యల్ని బాధ్యతలు నిర్వర్తించి ఉద్యోగుల మన్ననలు పొందారు. జిల్లా రిజిస్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించి
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల పక్షన పోరాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేసి ఓపిఎస్ ను పునరుద్ధరించేలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టే విధంగా ప్రయతించిన ఇరువురు రిజిష్టర్లు. స్మిత ప్రజ్ఞ హరి కోట్ల రవి ప్రముకంగా వుంటారు….హరి కోట్ల నిరంతరం సమాజ హితం లో ముందుడి అంబేత్కర్ ఆశ య సాధనలో తన వంతు పాత్ర పోషిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా రిజిస్టర్ గా ప్రజలకు సుపరిచితులు.. ఇలాంటి వ్యక్తి రాజకీయ లోకి వస్తె సమాజ హితం కోసం ప్రజలకు నిరంతరం సేవ చేసే అవకాశం కలుగుతుందని ఎంతోమంది రాజకీయ నాయకులు మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు పలు సందర్భాల్లో రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించిన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ప్రజలకు సేవచేశారు. ఒక సందర్భంలో గులాబీ బాస్ హరికొట్ల తో మధిరలో పోటీ చేయించాలని ప్రయత్నించిన వేదిక ముడిపడలేదు. ఇది ఇలా వుండగా ప్రస్తుతం రాబోయే పార్లమెంట్ ఎన్నికల కి అసెంబ్లీ సర్వే చేసిన మాదిరిగా చేసి రాష్ట్రంలో పార్లమెంట్ సీట్లు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ గ్రౌండ్ వర్క్ ప్లాన్ చేసింది. దానిలో భాగంగా వరంగల్ పార్లమెంట్ స్థానం కు హరి కోట్ల” పేరు ను పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం వరంగల్ పార్లమెంట్ కు సీటు కోసం హరి కోట్ల ప్రయత్నాలు ప్రారంభించినట్టు కనిపిస్తున్నాయి.దీనికి తగట్టుగు కాంగ్రెస్ లో రాజకీయ ఓనమాలు దిద్దడానికి రాజకీయ కురువృద్ధుడు నేటి కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో క్రియాశీలక బాగస్వామి.ఎంతో మందికి రాజకీయ ఓనమాలు తో తీర్చి దిద్ది నేటికీ మంత్రులుగా ఎంపీలుగా చేసిన రామ సహయం సురేందర్ రెడ్డి నీ ఎంచుకోవడంలో కృతర్ధులు అయ్యారని తెలుస్తోంది…ఆయన శిష్య రికంలో సీటు ఇప్పించడం గ్యారెంటీ అదేవిధంగా ఓట్లు వేయించడం లో ఆయనకు ఆయనే సాటి.అని . దానికి అనుగుణంగా తన స్నేహితుడు కాంగ్రెస్ నాయకుడు శ్రీరంగ రెడ్డి తో కలిసి అర్ ఎస్ ఆర్ ను కలిసి హరి కోట్ల ఆశీస్సులు తీసుకునట్టు గా తెలుస్తుంది. తన బంధువు రాష్ట్ర మంత్రి “మల్లు” రవి కి సీటు ఇవ్వడంలో సహాయం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి. వరంగల్ పార్లమెంట్ ఎస్సీ స్థానం రిజర్వ్ చేయడం ప్రస్తుతం ఈ సీటును ఆశిస్తున్న మాజీ జెడ్పీ సీఈఓ .పార్లమెంట్ మాజీ సభ్యులు రాజయ్య అడుగుతున్న అధిష్టానం అందుకు సముఖంగా లేనట్టు తెలుస్తుంది దీనికి తోడు కోడలు ఆత్మహత్య కేసు మకిలి రాజయ్య నీఇంకా వీడ లేదు.ఇది హారికొట్ల కి అవకాశం గా కనిపిస్తుంది ..వరంగల్ స్థానం నీ కాంగ్రెస్ బాజపా బి అర్ ఎస్ లు గట్టి ప్రయత్నం చేస్తున్న
బిఅర్ఎస్ 2పర్యాయాలు గెలిచి వ్యతిరేకత సంపదించుకుంది ఇక భాజపా గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం లేక పోవడం తో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి అవకాశాలు ఎక్కువగా వున్నాయి…దీనితో ఆశావహులు ప్రయత్నిస్తున్న అర్ ఎస్ ఆర్ అభయం ఇస్తే గెలుస్తారని నానుడి వుంది.హరి కోట్ల భవితవ్యం ఎలా వుందో వేచి చూడక తప్పదు


