ఊహల పల్లకిలో ఆశావహులు,
“డాక్టర్ సాబ్” మదిలో ఎవరున్నారో,
కురవి ఆలయ చైర్మన్ పదవి పై తొవ్వ ప్రత్యేక కథనం..
స్పెషల్ కంటెంట్ రైటర్ :అనుగోజు పూర్ణ చందర్..
8074753639

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాలం తర్వాత నూతన ఓరవడితో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, నాయకులు కార్యకర్తలు సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ప్రభుత్వం ఏర్పడ్డాక నామినేటెడ్ పదవులు పై ఆశావహులు ఊహల పల్లకిలో ఎక్కి పదవుల కోసం ఆరాటపడుతున్నారు. కొంతమంది నాయకులు కార్యకర్తల ముందు చూపుగా నామినేటెడ్ పదవులపై చర్చించుకుంటున్నారు. “భద్రకాళి సమేత వీరభద్రుడు” ఎవరిని కరుణిస్తాడో కానీ ఆలయ చైర్మన్ పదవి పై ఆశావహులు ఎదురు చూస్తూ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

తెరాస ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే వీరభద్ర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయన వీరభద్రుడికి బంగారు కోరమీసాలు సమర్పించుకున్నారు. ఆలయం అభివృద్ధి కోసం ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఇన్ని సంవత్సరాలైనా కూడా ఆ పనులు ఇంకా పూర్తికాలేదు. ఫిబ్రవరి మార్చి నెలలో మహాశివరాత్రి పండుగ కు వీరభద్రుని కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆలయ చైర్మన్ లేక సంవత్సరం అవుతుంది. తాత్కాలిక చైర్మన్ నియమిస్తారా,, లేక పూర్తిస్థాయిలో చైర్మన్ నియ మిస్తారో కానీ ఆశావహులు మాత్రం ఊహల పల్లకిలో ఊగుతున్నారు. భక్తులు, ప్రజలు మాత్రం, చదువు ఉన్నవారికి, దైవభక్తి కలిగి నిత్యం భక్తితో ఉన్న వారికే ఆలయ చైర్మన్ ఇస్తే బాగుంటుంది అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చైర్మన్గా చేసిన వాళ్లు భక్తిశ్రద్ధలు లేక ఆలయ అభివృద్ధిపై శ్రద్ధ చూపక ఆలయ ఆదాయం పైనే వారి చూపు ఉండేదని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం భక్తిశ్రద్ధలు ఉన్నవారికి పదవి ఇస్తే గుడి అభివృద్ధి చెందుతుందనిభక్తులు ఎదురుచూస్తున్నారు
ఆశావహులు ఎదురుచూపులు

బండి లక్ష్మారెడ్డి మాజీ ఆలయ చైర్మన్
కురవి మండలంలోని అయ్యగారి పల్లి గ్రామానికి చెందిన బండి లక్ష్మారెడ్డి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో 2002 సంవత్సరం నుండి 2004 సంవత్సరం వరకు ఆలయ చైర్మన్గా పదవి నిర్వహించారు, ఆయన చైర్మన్ గా ఉన్న కాలంలో మొట్టమొదటిసారిగా కళ్యాణ మహోత్సవానికి కలకత్తా డెకరేషన్ వేయించి సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. అప్పటి భక్తులు ఆలయ కమిటీ ఏర్పాటుచేసిన సాంస్కృతి కార్యక్రమాలపై సంతోషం వ్యక్తం చేశారు. లక్ష్మారెడ్డి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రామచంద్రనాయక్ పిలుపుమేరకు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ నుండి రామచంద్రనాయక్ డోర్నకల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పటి నుంచి లక్ష్మారెడ్డి తో సానిహితంగా ఉండేవారు. ఆయన అభ్యర్థన మేరకే కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆయన తెలిపారు. ఇప్పుడు మరోసారి ఆలయ చైర్మన్ గా చేయాలని కోరిక ఉన్నట్లు తన మనసులో మాట ఎమ్మెల్యే కు చెప్పినట్లు సమాచారం. ఎమ్మెల్యే మదిలో ఎవరున్నార కాని కొద్ది రోజుల్లో తేలనుంది,,

కొప్పుల వెంకటరెడ్డి
కురవి మండలంలోని కాంపెల్లి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి, తెలుగు దేశ ప్రభుత్వం లో 1995- 96 లో ఆలయ చైర్మన్ గా పదవి నిర్వహించారు. ఒక సంవత్సరం కాలం మాత్రమే ఆయన చైర్మన్ గా నిర్వహించినారు. తెలుగు దేశ పార్టీ డోర్నకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కాలం నుండి రామచంద్రనాయక్ తో తత్సంబంధాలు కలిగిన అయన. గత ఎన్నికల్లో కూడా రామచంద్రనాయక్ గెలుపు కొరకు కొరివి మండలం నుంచి వెంకట్ రెడ్డి పని చేశారు. ఆయన కూడా చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది,,

ఆవిర మోహన్ రావు
కురవి మండల కేంద్రానికి చెందిన మోహన్ రావ్ గత పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతూ వస్తున్నారు. ప్రభుత్వం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీ నుంచి గాని పార్టీ అభ్యర్థి నుంచి గాని చిల్లిగవ్వ ఆశించకుండా తన జేబులో ఉన్న డబ్బుల్ని ఖర్చు పెట్టుకుంటూ క్యాడర్ను తన వైపే ఉంచుకొని పార్టీలో కొనసాగుతున్నట్లు పార్టీ కార్యకర్తలు తెలిపారు. ఎవరి అండదండలు లేకపోయినా కురవి మండలంలో పార్టీని బలోపేతం చేసుకుంటూ డాక్టర్ సాబ్ కు అండగా ఉంటూ తన ఇల్లు నే పార్టీ కార్యాలయంగా మార్చుకొని కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. ఆలయ చైర్మన్ పదవిపై తన అభిప్రాయాన్ని ఎమ్మెల్యేకు చెప్పినట్లు సమాచారం. కష్టపడ్డ అధికారంలో లేనప్పుడు పార్టీ బలోపేతానికి కృషి చేశా ఇప్పుడు అవకాశం వచ్చింది నాకే ఆలయ చైర్మన్ పదవి ఇవ్వండి అని కోరుకుంటున్నారు. మండల కార్యకర్తలు నాయకులు మోహన్ రావు కి ఇస్తే బాగుంటుందని కోరుతున్నారు.

తవణం సుఖేందర్ రెడ్డి
అయ్యగారి పెళ్లి గ్రామానికి చెందిన సుఖేందర్ రెడ్డి గత పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోని కొనసాగుతూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆలయ చైర్మన్ పై ఆయన ఆశ పెట్టుకున్నారు. స్వద్ధాహాగా దైవ భక్తుడు నిత్యం దైవదర్శనాలు చేస్తూ వస్తుంటారు. పార్టీ కోసం కష్టపడ్డ ఇంతవరకు ఏ పదవులు అనుభవించలేదు ఆలయ చైర్మన్ నాకు ఇస్తే ఆలయ అభివృద్ధికి కృషి చేస్తూ ఉంటా అని ఆయన తెలిపారు.
ఎది ఏమైనా చైర్మన్ పదవి కోసం ఆశావహులు పోటీ పడుతున్న ఆలయ ప్రవర్తన నియమావళి వీరభద్రుని భూములు ఆస్తుల పరిరక్షణ బాధ్యతగా ఆలయ అభివృద్ధి కి కృషి భక్తుల సౌకర్యాల పెంపు… ఏటా జరిగే ఉత్సవాల నిర్వహణ ఎటువంటి ఆటంకాలు లేకుండా పరిపూర్ణంగా చేసేవారికీ పదవి దక్కని కురవి గ్రామ పెద్దలు ఆలయ భక్తులు కోరుకుంటున్నారు