జిల్లాలో పేట్రేగిపోతున్న” పీడీఎస్ బియ్యం ” దొంగలు
అక్రమ బియ్యం వ్యాపారం … “కోట్లకు” పడగలెత్తిస్తున్న వైనం …
పేదలకు బియ్యం బదులుగా “డబ్బులు ఇస్తూన్నా డీలర్లు”
పేద ప్రజలకు 5 రూపాయలు ఇస్తూ .. 12 నుంచి 16 రూపాయలకు డీలర్లు అమ్మకం
రేషన్ డీలర్లు సూత్రధారులుగా … పౌరసరఫరాల శాఖ పాత్రధారుల ?
తొవ్వ న్యూస్ .ఇన్ 9398236146


జిల్లాలో రేషన్ బియ్యం దందా మాత్రం ప్రభుత్వాలు మారినా ఆగడం లేదు. ప్రతి నెలా వంద ల క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. పేదల కోసం 2 రూపాయలకు ఇస్తున్న బియ్యం డీలర్ల ప్రమేయం పౌరసంబంధాల శాఖా అధికారుల ప్రోద్బలం తో చుట్టూరా తిరిగి ఎఫ్ సి ఐ కే అమ్ముతు దళారులు రేషన్ బియ్యం దొంగలు కోట్లు రూపాయలు గడిస్తున్నారు . ప్రతి నెల రేషన్ బియ్యం తీసుకోవడానికి వెళ్లిన ప్రజలకు డీలర్లు బియ్యం రాలేదనో నాసిరకంగా ఉన్నాయనో మరేదో సాకులు చెప్పి బియ్యానికి బదులుగా డబ్బులు ఇస్తున్నారు కాగ్ బియ్యం కు 3 రూపాయాల నుంచి 5 రూపాయల వరకు ఇస్తూ దళారులకు 12 నుంచి 16 రూపాయలకు అమ్ముకుంటూన్నారు. దళారులు బడా మిల్లర్ల ఎఫ్సీఐ అనుబంధ అధికారుల తో నేరుగా 25 నుచి 28 రూపాయలు అమ్ముతున్నారు . ఎఫ్ సి ఐ నుంచి వచ్చే గన్ని బ్యాగ్ లు కూడా మార్చకుండా నేరుగా తరలింపులు జరపడం విడ్డురం . బేతాలుని కధలో మలుపులు తిరుగుతూ మర్రిచెట్టు మీదకు వెళ్లినట్టుగా తిరిగి తిరిగి ఎఫ్సీఐ కి చేరుతున్నాయి . .ఇటీవల అసెంబ్లీ ఎన్నికల వేళ చెక్ పోస్ట్ లకు భయపడి జిల్లాలో బియ్యం మాఫియా కొంత తగ్గిన దానికి పదిఇంతలు పెంచి మరి తరలిస్తున్నారు గతంలో అధికార పార్టీ అండదండలతో వ్యాపారం చేసిన దళారులు రాష్ట్రంలో జిల్లాలో పార్టీ మారగానే . పార్టీ ఏదైనా మకేమిటని గులాభి కండువాలు తీసి నేడు ముడురంగుల కాంగ్రెస్ కండువాలు కప్పి చెలరేగిపోతున్నారు. రోజుకు క్వింటాళ్ల కొద్ది.జిల్లా సరిహద్దుళ్లు దాటుతున్నాయి సెలవు దినాల్లో పదుల కొద్దీ లారీలు 3 జిల్లాల కు సరిహద్దుగా వున్నా దంతలపల్లి మద్దిరాల హైవే మీదుగా సాగుతుతున్నాయ్ నకిరేకల్లు పరిసర ప్రాంతాల్లో దందా నాయకులు కూర్చొని లారీలను బట్టి ముడుపులు చెల్లిస్తున్నారు . ఏజెన్సీ ప్రాంతాలైన గంగారాం కొత్తగూడ , బయ్యారం ప్రాంతల్లో రాత్రులు తరలింపులో ప్రత్యేక కసరత్తు చేసిన యువకులు పాల్గొని తరలిస్తున్నారు . పౌరసరపాల శాఖ అధికారులు డీలర్ల ను థానికి చేయాల్సిన బాధ్యత ఉన్నపటికీ దెల్లర్ల వద్ద నుంచి దళారుల వద్దనుంచి వచ్చే అక్రమ వసూళ్లకు అలవాటు పది పేదలకు ఇచ్చే బియ్యం ను అర్కున ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం తెస్తున్నారు . జిల్లా లో వినియోగదారుని క్షేమ కోసం పనిచేస్తున్న సంఘాలు అధికారులు రేషన్ బియ్యం అక్రమ తతాలింపు డీలర్ల జిమ్ముకులపై నిఘా వేసి అకర్మ బియ్యం తరలింపు పై చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు .


