నిజమైన లబ్ధిదారులకు 6 గ్యారంటీలను వర్తింపజేసి ఆర్థిక చేయూత అందిస్తాం….
“పాలకుర్తి “ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి
తొవ్వ న్యూస్.ఇన్ 9398236146


6 గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం ప్రజాపాలన తో ప్రగతి పథం సకల జనహితం కానుందని, అర్హులైన పేదవారికి ఆర్థిక చేయూత కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పాలకుర్తి శాసనసభ సభ్యురాలు మామిడాల యశశ్విని రెడ్డి తెలిపారు.గురువారం ఉదయం పాలకుర్తి నియోజకవర్గం మహబూబాబాద్ జిల్లా తోరూర్ మండలంలోని పత్తేపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన కార్యక్రమానికి ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ముఖ్యమంత్రి సందేశాన్ని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మనది ప్రజా ప్రభుత్వమని, అసలైన అర్హులకు 6 గ్యారంటీలను ఖచ్చితంగా వర్తింప చేస్తామన్నారు. డిసెంబర్ 28 వ తేది నుండి 2024 జనవరి 6 వ తేదీ వరకు ప్రజాపాలనతో అభయ హస్తం గ్యారంటీలకు దరఖాస్తుల స్వీకరణ ప్రతి గ్రామంలో,వార్డుల్లో నిర్వహించబడుతుందన్నారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు,అభయ హస్తం లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఒకటే దరఖాస్తులో అన్ని నింపాల్సి ఉంటుందని, అవసరమగు జిరాక్స్ కాపీలను వెంట జత చేయాలని, అధికారులకు మధ్య దళారులకు ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దని, దరఖాస్తును కూడా ప్రభుత్వమే అందిస్తుందని, ప్రభుత్వం మంజూరు చేసే సంక్షేమ పథకాలకు ఎవ్వరికీడబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, మిమ్మల్ని అడిగితే, ఇబ్బందులకు గురి చేస్తే నేరుగా ఫిర్యాదు చేయాలన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 20 రోజులలోనే 2 పథకాలను విజయవంతంగా అమలు చేసుకుంటున్నామని, మిగతా పథకాలను 100 రోజుల్లో అమలు చేస్తామని పార్టీలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపడతామన్నారు. ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం కాకుండా అధికారులు బాధ్యతాయుతంగా తమ కర్తవ్యాలను నిర్వర్తించాలని కోరారు.లబ్ధిదారుల దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించాలని అర్హులైన పేదలకు 6 గ్యారంటీలను వర్తింప చేయాలని, పెండింగ్లో ఉన్న పనులను అన్నిటిని సకాలంలో పూర్తి చేస్తామన్నారు.6 గ్యారంటీల సంక్షేమ ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలిపారు. అనంతరం కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు, చెక్కులను అందజేసి, ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దరఖాస్తుల స్వీకరణ స్టాల్స్ ను ఎమ్మెల్యే రిబ్బన కట్ చేసి ప్రారంభించి దరఖాస్తుదారుల నుండి ఫారాలను స్వయంగా స్వీకరించారు. పాఠశాల తరగతి గదిలోకి వెళ్లి చిన్నారులతో కాసేపు ముచ్చటించి రోజు క్రమం తప్పకుండా బడికి రావాలని మంచిగా విద్యభ్యాసన చేయాలని వారితో సమానంగా బెంచ్ పై కూర్చునారు.ఈ కార్యక్రమంలో సర్పంచి సోమలక్ష్మి, ఎంపీపీ చిన్న అంజయ్య, జడ్పిటిసి శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, వైస్ ఎంపీపీ శ్యాంసుందర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు షేక్ అంకుష్, డి సి ఓ ఖుర్షిద్, ఎంపీడీవో కుమార్, డి.ఈ మధుసూదన్, మెడికల్ ఆఫీసర్లు పంచాయతీ కార్యదర్శులు, అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
