కాంగ్రెస్ బిఅర్ఎస్ నేతల ఫ్లెక్సీలు చింపిన గుర్తు తెలియని ఇరువర్గాలు కార్యకర్తలు…
ఇదేం రాజకీయాలంటు పక్కునా నవ్వుతున్న ప్రజలు….
తొవ్వ న్యూస్.ఇన్./9398236146

జిల్లా కేంద్రంలో అధికార కాంగ్రెస్స్ ప్రతిపక్ష బి అర్ ఎస్ పార్టీల మధ్య ఫ్లెక్సీల బ్యానర్ల రగడ దుమారం రేపుతోంది.. నూతన ఎమ్మెల్యే గా ఎన్నికైన డాక్టర్ మురళి నాయక్ ప్రభుత్వ అధికార క్యాంపు కార్యాలయం గెలిచిన వెంటనే కేటాయించినప్పటికి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అయ్యప్ప మాలలో ఉండటం అదే క్యాంపు కార్యాలయంలో స్వామి పీఠం ఉండడంతో శబరిమల యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ చేస్తానని తెలపడం జరిగింది యాత్ర ముగిసిన వెంటనే తన వస్తువులు అన్ని తీసుకొని వెళ్ళి ఖాళీ చేసి ఇవ్వడం జరిగింది . కొత్త సంవత్సరం లో జనవరి 1వ తేదీన నూతన క్యాంపు కు వెళ్ళాడని రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఎమ్మెల్యే వర్గీయులు .దీనిలో భాగంగా కాంగ్రెస్స్ నాయకులు కార్యకర్తలు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు శనివారం రాత్రి గుర్తు తెలియని బిఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో కొట్టి చించి వేసరని ఆరోపణలు వెల్లువెత్తాయి.. చాలామంది నేతల ఫ్లెక్సీ లు ఉన్నపటికీ ఒక వార్డ్ కౌన్సిలర్ ఫ్లెక్సీ చించడం వెనుక వ్యక్తి గత దురుద్దేశంమా లేక కాంగ్రెస్ పార్టీ పై వున్న కోపమా తెలియాల్సి వుంది.ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ అభిమాని ఒకరు అమరవీరుల స్థూపం వద్ద వున్న ఫ్లెక్సిని చించడం తో ఫ్లెక్సీల రచ్చ మొదలైంది దీనితో ఇరువర్గాలు కార్యకర్తలు ఫోన్ చేసుకొని తిట్టుకునే స్థాయికి వెళ్ళింది ఇది ఇలా వుండగా మహబూబాబాద్ ఎంపి జన్మదిన వేడుకల ఫ్లెక్సీలు కడుతూ పక్కనే ఉన్నరాష్ట్ర కాంగ్రెస్ నేత వెన్నం అంతకు ముందే కట్టించిన ఫ్లెక్సీ లు కట్టె క్రమంలో పడిపోవడం వాటిని సరి చేయకుండా అలాగే వదిలేయడంతో వివాదాలు తలెత్తుతున్నయ్.. గతంలోనూ బిఆర్ వర్గపోరు తో ఎంపి కవిత మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఫ్లెక్సీల పంచాయతీ రచ్చకెక్కి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ల వరకు వెళ్లిన సంగతి విదితమే.. శాంతియుతంగా నూతన సంవత్సర ఆహ్వానం పలికే ఆనందంలో ఉన్న ప్రజలకు ఫ్లెక్సీల పంచాయతీ ఏంటని? నవ్విపోతున్నారు…

