వడ్డే ఓబన్న పోరాట స్ఫూర్తి ని యువతరం ఆదర్శంగా తీసుకోవాలి…
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్


వడ్డే ఓబన్న పోరాట స్ఫూర్తిని యువతరం ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు.గురువారం ఐడిఓసి లోని హాల్లో ఓబన్న జయంతి ఉత్సవం పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ వారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారుఅనంతరం ఏర్పాటుచేసిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ…స్వాతంత్ర్యం పోరాటంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అనుచరుడుగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు.జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రజలందరి సహకారం అవసరమన్నారు సంకల్పబలంతో ముందడుగు వేయాలన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరే విధంగా కృషి చేస్తానని మహనీయుల ఆశయాలకు కట్టుబడి పని చేస్తానన్నారు.
ప్రభుత్వం అధికారికంగా జయంతి ఉత్సవాలు నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, బిసి వెల్ఫేర్ అధికారి నరసింహ స్వామి, గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు గుంజే హనుమంతు, జిల్లా అధ్యక్షులు సంపంగి రామచంద్రు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లపు రామదాసు, జిల్లా ఉపాధ్యక్షులు తమ్మిశెట్టి రామదాసు, గూడూరు ఉపసర్పంచ్ శివరాత్రి సంపత్, మండల అధ్యక్షులు ముద్దంగుల దర్గయ్య, యూత్ అధ్యక్షులు బండారి చిరంజీవి, పట్టణ నాయకులు వల్లెపు ఉప్పలయ్య, గండికోట రవి, ఓర్సు మల్లేషు, సూర శ్రీనివాసు, వల్లెపు నాగరాజు, రాపాలు వెంకటేశు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు సేవా గుణాలను అవలంబించుకోవాలి
మానుకోట సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్
దైవ కృప చిల్డ్రన్ హోమ్ లో (ఆశ్రమ) పిల్లలకు దుస్తులు, స్టేషనరీ, నోట్ బుక్స్ పంపిణీ

విద్యార్థులు ఇష్టపడి చదువుతూ విద్యార్థి దశలోనే సేవా గుణాలను అవలంబించుకోవాలని మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు,జిల్లా కేంద్రంలోని దైవకృప చిల్డ్రన్ హోమ్ ఆశ్రమంలోని పిల్లలకు గురువారం సంక్రాంతి పండుగ కానుకగా దుస్తులు,స్టేషనరీ, నోట్ బుక్స్ అందించారు కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ చిల్డ్రన్ హోమ్ నిర్వాహకులు, కిషన్. కాంగ్రెస్ నాయకులు చింతల్ రామరాజుతదితరులు పాల్గొన్నారు.
గూడూరులో
సావిత్రిబాయి పూలే ఫాతిమా షేక్ జయంతి వేడుకలు

గూడూరు ఐసిడిఎస్ కార్యాలయంలో గురువారం భీమ్ సేఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ఫాతిమా షేక్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్ చిత్రపటాలకు పూలమాలలు వేసి అంగన్వాడి టీచర్లకు పూలమాలలు, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా భీం సేఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరన్న మాట్లాడుతూ
అణగారిన వర్గాల అభ్యుదయ కోసం కృషి చేసి మహిళల చదువులకే నిరంతరం శ్రమించిన భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మహాత్మా సావిత్రిబాయి పూలే, భారతదేశ మొట్టమొదటి ముస్లిం మహిళ ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ అన్నారు. సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్ లను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులకు విద్యను అందించాలని చిన్నపిల్లలకు అంగన్వాడి టీచర్లు శ్రద్ధతో చదువును అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ నిలోఫర్ ఆజ్మీ, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు పర్నాంది రామయ్య, భీమ్ సెఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూక్య సురేష్ నాయక్, మండల కో ఆప్షన్ సభ్యులు రహీం పాషా, హైమాద్, బోడసురేష్, అంగన్వాడి సూపర్వైజర్లు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ పార్లమెంట్ గులాబీ జెండా ఎగురవేయలి…
గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు .పోడు పట్టాల పంపిణీ అనేక పథకాలు అందించినప్పటికీ ఓటమి
మహబూబాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం

మహబూబాబాద్ పార్లమెంట్ గులాబీ జెండా ఎగురవేసి తీరాలని గిరిజన ఆదివాసీలకు గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుతో పాటు పోడు పట్టాల పంపిణీ సహా అనేక పథకాలు అందించిన ఆ ప్రాంతాల్లో కూడా ప్రజలు తమకు పూర్తి మద్దతు ఇవ్వలేదని, అటువంటి అంశాలను ఆత్మవిమర్శ చేసుకుని ముందుకు పోదామని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.గురువారం తెలంగాణ భవన్లో జరుగుతున్న మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో* ఆయన ప్రసంగించారు. *అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ అనుకోలేదని, అందుకే నోటికి ఏది వస్తే అది హామీ ఇచ్చారని* వివరించారు. *కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని నమ్మి ప్రజలు గొప్పగా పని చేసిన నాయకులను కూడా తిరస్కరించారని* కేటీఆర్ తెలిపారు. *ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారని, తొమ్మిదిన్నరేళ్లలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చినట్లు* కేటీఆర్ వివరించారు. *దేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు 73 శాతం జీతాలు పెంచిన ఏకైక నాయకుడు కేసీఆర్* అని తెలిపారు. 29 లక్షల పింఛన్లను 46 లక్షలకు పెంచామన్న ఆయన, ఇలాంటి అనేక అంశాలను చెప్పుకోవడం విఫలమయ్యామని పేర్కొన్నారు. *కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందని,* *పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే తామే గెలిచే వాళ్లమని* కేటీఆర్ వ్యాఖ్యానించారు. *వందలాది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా, ఏనాడు ప్రజలను లైన్లలో నిలబెట్టలేదని,* ప్రజల సౌకర్యం చూశాం తప్ప రాజకీయ ప్రయోజనం, ప్రచారం గురించి ఏనాడూ ఆలోచించలేదని అన్నారు. ప్రజలు తమను పూర్తిగా తిరస్కరించలేదని గుర్తుంచుకోవాలన్న కేటీఆర్, బీఆర్ఎస్కు మూడో వంతు సీట్లు 39 వచ్చాయని గుర్తు చేశారు.స్థానిక సంస్థలు మొదలు అసెంబ్లీ వరకు బలమైన నాయకత్వం ఉందని, అన్నింటికీ మించి కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు ఉన్నారని కేటీఆర్ తెలిపారు. *మహబూబాబాద్ లోక్సభ ఎన్నికలే గెలుపునకు సోపానం కావాలనిఅన్నారు. పార్టీ సమావేశాలను వరుసగా నిర్వహిస్తామని, అనుబంధ సంఘాలను బలోపేతం చేయడంతో పాటు పార్టీకి అన్ని వర్గాలను దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపడతామని కేటీఆర్ వివరించారు.
బి ఆర్ ఎస్ టి ఆర్ ఎస్ గా మారాలి
బి ఆర్ ఎస్ టి ఆర్ ఎస్ గా మారాలని ప్రజల్లో టి ఆర్ ఎస్ కే ఆదరణ వుందని విద్యార్థి ఉద్యమ నాయకుడు రవి కుమార్ అన్నారు. ఎన్నికల ఓటమికి కారణాలు వివరిస్తూ నాటి ఉద్యమ నేపథ్యం రాజకీయ ప్రస్థానం వివరించారు..తెలంగాణ లో పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోవడానికి ఉద్యమ తెలంగాణ గా ముందుకు రావాలని ప్రజల ఆకాంక్ష కూడా అదేనని వివరించారు