ఊరు ఊరునా రాముని పట్టాభిషేకం…
జిల్లా కేంద్రంలో ఘనంగా శోభాయాత్ర….
Thovva web news.21.Jan. sun

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దేవాలయాలు ధార్మిక సంస్థల విశ్వహిందూ పరిషత్ భాజపా మహిళ మోర్చ.రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలోశ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర మహబూబాబాద్ ఆధ్వర్యంలో జనవరి 22న అయోధ్యలో బలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట పురస్కరించుకొని శ్రీరాముని విజయ సంకల్పయాత్ర ఆదివారం ఘనంగా నిర్వహించారు. పట్టణ పురవీధల గుండా ఈ కార్యక్రమం అత్యంత శోభాయమానంగా సాగింది రామనామ జపం జై శ్రీరామ్ నినాదాలతో పట్టణం కషయమయం గా మారింది హిందువులు అధిక సంఖ్యలో పాల్గొని శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపా మహిళ నాయకులు ఇందు భారతి మాజీ జిల్లా అధ్యక్షులు యప సీతయ్య దార వెంకటేశ్వరరావు. భవిరిశెట్టి శ్రీనివాస్ లు పాల్గొని మాట్లాడుతూ 500ఏండ్ల భవ్య రామ మందిర నిర్మాణం దాని పూర్వాపరాలు వివరిస్తూ సోమవారం జరుగబోయే ప్రాణప్రతిష్ట దేశమంతా పండుగ లా నిర్వహిస్తున్నారని ఉరు ఉరునా రామ మయం కాబోతుందని పార్టీలకు అతీతంగా ప్రజలు ఒక్కథాటి పైకి వచ్చి రేపు జరుగబోయే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని విక్షీస్తు ప్రతి గ్రామాన రామ పట్టాభిషేకం నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి రామ భక్తులు మహిళ లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నరు

జై శ్రీరామ్ జై జై శ్రీరామ్