పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వారికి ప్రాధాన్యత
జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పళ్ళ మాలతి రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బొబ్బ సోమిరెడ్డి

Thovva web news//Jan.21.sun
NARSIMHILULAPETA;
ప్రభుత్వ సలహాదారులుగా మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి ( సీఎం వ్యవహారాలు), షబ్బీర్ అలీ (ఎస్సీ, ఎస్టీ,ఓబీసీ, మైనారిటీ శాఖలు), హర్కర వేణుగోపాల్ (ప్రోటోకాల్,పబ్లిక్ రిలేషన్), ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి లను నియమించడం పట్ల మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పల్ల మాలతి రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, పెద్దనాగారం స్టేజ్ సర్పంచ్ బొబ్బ సోమిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం వారు ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తూ కాంగ్రెస్ గెలుపుకు కృషి చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తూ.. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం పట్ల మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్, నర్సింహులపేట మండల కాంగ్రెస్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వారు ఎంతో కృషి చేశారని చెప్పారు. ఏఐసీసీ నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర నాయకుల ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి 2021 జూన్ లో తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడిగా, 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ కన్వీనర్గా, 2024 జనవరి 20న తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారాల ప్రధాన సలహాదారుగా నియమించిందని వారు పేర్కొన్నారు. వారి నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు.