గీత కార్మికులకు మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలి-
నీరా కేంద్రాన్ని మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి-
గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలి చిలువేరు
తొవ్వ వెబ్ న్యూస్ .23, జనవరి మంగళవారం….
9398236146


ఈ ప్రాంతం లో భూస్వామ్యులను ఎదిరించి ప్రజలకు బానిస సంకెలనుంచి విముక్తి మార్గం చూపినది గౌడ కులమే అని పెరుమాండ్ల జగన్నాధం , గండి అయిలయ్య లాంటి నాయకులు సారధ్యం వహించి గౌడ కులాన్ని రాష్ట్రంలో ఘనంగా నిలబెట్టారని గతపాలకులు గీత కార్మికులను పట్టించుకోలేదని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం వి రమణ అన్నారు . మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని లక్ష్మీ సాయి గార్డెన్లో మండల కేజికేఎస్ ఆధ్వర్యం లో గౌడ ఆత్మీయ సమ్మేళనం,ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు రమణ , జిల్లా అధ్యక్షులు యమాగాని వెంకన్న , మాజీ ఎమ్మెల్సీ గండి సావిత్రమ్మ , మాజీ మున్సిపల్ చైర్మన్ , స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ సతీమణి ఉమా మురళి నాయక్ లు విశిష్ట అతిధులుగా హాజరై కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర క్యాలెండర్ ఆవిష్కరించారు . ఈ సందర్బముగా ఏర్పాటుచేసిన సమావేశాల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో గీత కార్మికులకు మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలని .ప్రమాదానికి గురై చనిపోయిన వారి కుటుంబాలకు, శాశ్వత వికలాంగులకు 10 లక్షలు, తాత్కాలిక వికలాంగులకు లక్ష చొప్పన ఎక్స్రేషియా నెల రోజుల లోపు ఇవ్వాలి. మెడికల్ బోర్డు విదానం తొలగించాలి. వృత్తిలో ఎక్కడ ప్రమాదం జరిగినా వర్తింప జేయాలి.బెల్టు షాపులను పూర్తిగా నిషేదించాలి. కల్లులోని పోషకాలను, ఔషద గుణాలను ప్రభుత్వమే ప్రచారం చేసి మార్కెట్ సౌకర్యం కల్పించాలి.గీత కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ ఎలాంటి షరతులు లేకుండా 50 సంవత్సరాలు నిండిన ప్రతి గీత కార్మికునికి చేయూత పథకం ద్వారా 4వేలు ఇవ్వాలి.కల్లుగీత కార్మికులందరికి వృత్తికి ఉపయోగ పడే ద్విచక్ర వాహనాలు ఇవ్వాలి.ఎజెన్సి ఏరియాలో కల్లుగీత సొసైటీలను పునరుద్ధరించి సంక్షేమ పధకాలు అక్కడి గీత కార్మికులకు వర్తింప చేయాలి.రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి 5 వేల కోట్లు కేటాయించి టాడి కార్పొరేషన్ ను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.

గౌడ కార్మికులను ఆదుకోవాలి “చిలువేరు”
గౌడ కార్మికులను ఆదుకోవాలని గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మి గౌడ్ మాట్లాడుతూ నీరా, తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నెలకొల్పాలి. గౌడ యువతీ యువకులకు ఉపాది కల్పించాలని,తాటి ఈత చెట్లు నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకునే విదంగా కొత్త చట్టం తీసుకరావాలి.ప్రభుత్వ సంక్షేమ పధకాలు వర్తించ చేయాలి.మెమో నెం. 3347 /డి/2023 ప్రకారం సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించాలి.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విదంగా జనగాం జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలన్నారు. జిల్లా ,మండల అధ్యక్షులు యమగాని వెంకన్న,ఉప్పలయ్య మాట్లాడుతూ ప్రతి సొసైటీకి చెట్ల పెంచడానికి 5 ఎకరాలు ప్రభుత్వ భూమి ఇవ్వాలని ఉన్న 560 జివో అమలు చేయాలి. లేదా కొనివ్వాలి.టిడిపి ప్రభుత్వం హయాంలో ఇచ్చిన 439 సొసైటీల భూములకు పెన్సింగ్ చేయించాలి.
కల్లుగీత కార్మికులకు అండగా ఉంటాం ..
మాజీ మున్సిపల్ చైర్మన్ ఉమా మురళి నాయక్ ..
కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అందగాఉంటుందని గత ప్రభుత్వం లో కార్మికులకు ఎటువంటి సదుపాయాలు అందలేదని కార్మికులు చెట్ల పై నుంచి పడిన ఎక్స్గ్రేషియా అందించడం ఆనాటి బిఅరెస్ నాయకులూ ఇవ్వలేదని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్లుగీత కార్మికులకు అండగా వుంటూ వారికీ అన్నివిధాలుగా ఆదుకోవడానికి కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో లో గీతకార్మికులు సమస్యల సంజీవిని పెట్టారని త్వరలో అమలు చేస్తారని
అన్నారు
కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి ,మాజీ ఎమ్మెల్సీ సావిత్రమ్మ ..
కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్సీ సావిత్రమ్మ అన్నారు ఆమె మాట్లాడుతూ తాటి, ఈత, జీనుగు, ఖర్జూర తదితర కల్లునిచ్చే పొట్టి చెట్లు నాటాలి.కల్లుగీత కార్పోరేషన్ నుండి వృత్తిలో చనిపోయిన వారి కుటుంబాలకు ఇస్తున్న తక్షణ సహాయం పెంచాలన్నారు. దహన సంస్కారాల కొరకు 50,000లు, గాయాలైన వారికి వైద్య ఖర్చుల కొరకు 25,000లు ఇవ్వాలన్నారు .


అనంతరం అందరి సమక్షంలో కల్లు గీత కార్మిక సంఘం 2024 క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా 5000 క్యాలెండర్ లు ముద్రించిన సమ్మిగౌడ్ ను అభినందిచారు . ఈ కార్యక్రమంలో ,మండలఅధ్యక్ష,కార్యదర్శులు బబ్బూరి ఉప్పలయ్య, మోడెం వెంకటేశ్వర్లు పిఎసిఎస్ చైర్మన్ దీకొండ వెంకన్న ,గంధసిరి స్వరూప సోమన్న ,కదిర స్రవంతి ప్రకాష్, సమ్మెట వెంకన్న ,గోపా మండల అధ్యక్షులు కూటికంటి మధు,పిఎసిఎస్ మాజీ చైర్మేన్లు బండారు వెంకన్న, గడ్డం యాకమూర్తి, గోపా జిల్లా సలహదారులు మోడెమ్ రవీందర్,గోపా జిల్లా ఉపాధ్యక్షులు చిర్ర యాకంతం గౌడ్, చీకటి వేలాద్రి మాజీ సర్పంచులు బండారు గోపమ్మ దయాకర్ ,గందసరి వెంకన్న మాచర్ల ప్రసాద్, వీరితోపాటు అన్ని గ్రామాల సొసైటీ అధ్యక్షులు పాల్గొన్నారు.
