18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలి
తహసిల్దార్ వివేక్…
thovva news web. 25.Jan.Thursday

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు విధిగా ఓటర్ నమోదు చేర్చుకోవాలని తాసిల్దార్ వివేక్ పిలుపునిచ్చారు గురువారం
14వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని.. వయోవృద్ధులు దివ్యాంగులు యువ ఓటర్లతో సమావేశం ఏర్పాటు చేస్తూ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
స్థానిక తహసిల్దార్ వివేక్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో అతిశక్తివంతమైన ఆయుధంగా వినియోగించుకోవాలని కోరారు. వయోవృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వం ఓటు హక్కు వినియోగించుకునేందుకు సులభతరమైన మార్గాలను తీసుకుంటున్నట్లు తెలియజేశారు. గతంలో బలం ఉన్న వారిదే రాజ్యం గా ఉండేదని, స్వాతంత్ర్యo అనంతరం 1950 జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని స్వేచ్ఛాయుత వాతావరణం లో నిర్వహించుకున్నట్లు తెలియజేశారు. జాతి, కులం, మతం వంటి తారతమ్యాలు లేకుండా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా భారత ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు.ఎన్నికలను సజావుగా ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఓటర్ల జాబితా చేపట్టవలసి ఉందని అందుకు ఓటర్లు చైతన్యవంతం అవడంతో పాటు ఓటు హక్కు పొందుతూ వినియోగించు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భారతి, ఎంపీ ఓ సోమలాల్, మోడల్ స్కూల్ హెచ్ఎం ఆనంద్ బాబు, తోపాటు మోడల్ స్కూల్ విద్యార్థులు, హై స్కూల్ విద్యార్థులు వివిధ పాఠశాల విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు
