ఆడపిల్లలను అన్ని రంగాల్లో ఎదగనీయాలి…
డీ.హెచ్.పీ జిల్లా ప్రధాన కార్యదర్శి.లింగంపెల్లిసుగుణ

ఆడపిల్లల సాధికారతకు చదివే మూలం అని, పట్టుదలతో చదువుకునే బాలికలు సమాజాన్ని జాగృత పరిచే దివ్వెలవుతారని దళిత హిందూ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంపెల్లి సుగుణ అన్నారు శుక్రవారం బాలికా వందన్ కార్యక్రమంలో బాగంగా జిల్లా కేంద్రంలో డీ.హెచ్.పీ ఆద్వర్యంలో చదువుకునే పేద విద్యార్థినిలకు నూతన దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలు ఆత్మ విశ్వాసంతో గొప్పగా ఎదగాలంటే పట్టుదలతో చదువుకోవాలన్నారు. చదువుతోనే బాలికల భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు అధిరోహించేందుకు సాధ్యమవుతుందని నేటి సమాజంలో స్త్రీ పురుష అసమానతలు పోవాలంటే చదువే ఆయుధం అన్నారు. ఆడపిల్లల శ్రేయస్సు కోరే తల్లి దండ్రులు బాల్య వివాహాలు అరికట్టాలన్నారు. ప్రభుత్వాలు యువతులకు చదువు, ఆరోగ్యం, ఉపాది అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక పథకాలు అమలు చేయాలని కోరారు.అమ్మాయిలపట్ల వివక్ష లేకుంటే అన్ని రంగాల్లో ముందుకు సాగిపోతరన్నారు ఈ కార్యక్రమంలో డీ.హెచ్.పీ అధ్యక్షురాలు ఇరుకుల్ల లక్ష్మి, అంగన్ వాడి టీచర్ నెమ్మది భారతమ్మ, సీనియర్ జర్నలిస్టు ఇసంపెల్లి సాయికుమార్, పూజిత, అన్నెపర్తి రమ్య, ఇరుకుల్ల విష్ణు ప్రియ, కుక్కెముడి సాయిలమ్మ, పుచ్చకాయల రాజమ్మ, పూలమ్మ, తప్పెట్ల నీలమ్మ తదితరులు పాల్గొన్నారు