అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవు…
సీజ్ చేసిన ఇసుక డంపులను వేలం వేసిన అధికారులు
వేలంపాట ద్వారా రూ.1,76,000/- ఆదాయం..
ఎస్ఐ సతీష్, తాసిల్దార్ వివేక్

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని తాసిల్దార్ వివేక్ ఎస్ఐ సతీష్ సంయుక్తంగా హెచ్చరించారు.శనివారం ఉదయం తహసీల్దార్ వివేక్ పోలీస్ సిబ్బంది తో పాటు మండలంలోని అక్రంగా నిల్వ చేసిన ఇసుక డంపులను సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుక డంపులకు అదేరోజు సాయంత్రం వేలంపాట నిర్వహించారు. మండలంలోని కొమ్ములవంచలో ఒక డంపుగాను రూ.31 వేలు, జయపురం రెండు డంపులకు రూ. 60 వేలు, నర్సింహులపేటలో ఒక డంపుకు రూ. 80 వేలు, బొజ్జన్నపేటలో ఒకడంపుకు గానూ రూ. 5 వేలు … మొత్తం డంపులకు రూ. 1 లక్ష 76 వేలు వచ్చినట్లు తాహసిల్దార్ వివేక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సతీష్, ఏఎస్ఐ వెంకన్న, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సైదులు మరియు సిబ్బంది తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మండల కేంద్రంలో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు ఎవరైనా ఇసుక అక్రమంగా తరలిస్తే పోలీస్ స్టేషన్ తహసిల్దార్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు
