స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సవ్ టొప్పో
Thovva web news.In.27.Jan sat

జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సవ్ టొప్పో అన్నారు.శనివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ కార్యదర్శి అధ్యక్షతన కమిటీ సభ్యులు తో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… గ్రంథాలయాలను పాఠకులకు అనుకూలంగా సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు.ప్రధానంగా అత్యవసరమైన సీసీ కెమెరాలు, ఇన్వర్టర్ వంటివి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.బుక్ ఫెయిర్ వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని సెక్రటరీని ఆదేశించారుగ్రంథాలయాలు చిన్నారులకు చేరువ చేసేలా విజ్ఞానాన్ని వినోదాన్ని పంచే పుస్తకాలను ఏర్పాటు చేసి వినియోగించు కునేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సమావేశంలో కమిటీ సభ్యులు వయోజన విద్య ఉమ్మడి జిల్లాల అధికారి జై శంకర్ జిల్లా పౌర సంబంధాల అధికారి శ్రీనివాసరావు, గ్రంథాలయ కార్యదర్శి శ్రీలత లైబ్రేరియన్లు వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.
