గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం…
అసెంబ్లీ లో ఓటమి కసి పార్లమెంట్ లో చూపించాలి
..
10 నుంచి 15 కి పైగా గెలిచి గులాబీ సత్తా చాటాలి…
Thovva web news. 27 Jan sun

మాజీ ముఖ్యమంత్రి బి అర్ ఎస్ అధినేత కెసిఆర్ ప్రజల ముందుకు రాబోతున్నారు. ఫిబ్రవరి 01గురువారం గజ్వేల్ శాసన సభ్యునిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.మేరకు శాసనసభాపతికి శనివారం ఆయన లేఖ రాశారు. డిసెంబరు 3వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా అదే నెల 9న అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో అధిక శాతం ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ తుంటి ఎముక శస్త్ర చికిత్స కారణంగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇటీవల ఆయన మెల్లమెల్లగా కోలుకోవడంతో వచ్చే గురువారం శాసనసభకు వెళ్లి ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నారు.తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే కామారెడ్డిలో అనూహ్యంగా ఆయన ఓటమిపాలయ్యారు. గజ్వేల్ నుంచి గెలుపొందారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన మూడు శాసనసభ ఎన్నికల్లోనూ కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కి రావడం రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగిన తదుపరి ప్రమాదవశాత్తు బాత్రూం లో జారిపడి తుంటి ఎముక విరగడం తో గులాబీ శ్రేణుల్లో తీవ్ర కలవరం నెలకొని వుంది.బాస్ కి ఏమవుతుందో అని కార్యకర్తలు అధైర్య పడ్డారు.దీనికి తోడు 10ఏండ్లు అధికారం వుండి ఒకేసారి అధికారాన్ని కోల్పోవడం తో క్యాడర్ లో ఒకింత నైరాశ్యం నెలకొని వుంది కార్యకర్తలు ఇంకా ఓటమి నీ జీర్ణించుకోలేక ప్రజలోకి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా గమనించిన కేసీఆర్ పార్టీకి .కార్యకర్తలకు నూతన ఉత్సాహం. నింపడం కోసం పిబ్రవరి 1న ప్రజల ముందుకు వస్తున్నారు.. ఫిబ్రవరి 17 న జన్మదినం సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమంలో నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు సమాచారం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ లో పోయిన పడిపోయిన గ్రాఫ్ ఓటమిని పక్కన పెట్టి 17పార్లమెంట్ సీట్ల లో కనీసం 12 నుంచి 15 దక్కించుకొని పూర్వ వైభవం తీసుకొని వచ్చే విధంగా దిశ నిర్దేశం చేయనున్నారు. ఎది ఏమైనా పులి వస్తుందనే సంకేతాలు గులాబీ శ్రేణుల్లో ఆనందాలు వ్యక్తమవుతున్నాయి…
(Thovva web news.//9398236146)
.
