బొగోజు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం
టివిబిజెఎ జిల్లా అధ్యక్షులు గుండోజు శ్రీనివాస్…..
Thovva web news.in.29.Jan

విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టివిబిజెఎ) నిరంతరం కృషి చేస్తుందని ఆ సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు గుండోజు శ్రీనివాస్ అన్నారు.టివిబిజెఏ రాష్ట్ర అధ్యక్షులు తూములూరి సత్యనారాయన ఆదేశాల మేరకు ఇటీవలే గుండెపోటుతో మృతి చెందిన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కు చెందిన జర్నలిస్ట్ బోగోజు సురేష్ కుటుంబాన్ని సోమవారం గొట్టిపర్తి లోని ఆయన స్వగ్రామంలో కుటుంబ సభ్యులను సంఘం జిల్లా అధ్యక్షులు గుండోజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కలిసి పరామర్శించి, సంఘం తరుపున సురేష్ కుటుంబానికి 50 కిలోల బియ్యంతోపాటు 4 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా గుండోజు శ్రీనివాస్ మాట్లాడుతూ భవిషత్తులో సురేష్ పిల్లల విద్య విషయంలో సురేష్ కుటుంబానికి ప్రభుత్వం నుండి చెందాల్సిన రాయితీలను, సహకారాన్ని సకాలంలో అందేలా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా నాయకులు రావూరి ప్రశాంత్, దూదికట్ల రవీంద్రా చారి తదితరులు పాల్గొన్నారు.