బాయ్కాట్ మాల్దీవుల నినాదం… ఆర్థిక రాజకీయ సంక్షోభం…..
భారత్ విదేశాంగ విధానం పై ప్రపంచం ప్రశంశలు
Thovva web news.29Jan mon

అనుకున్నట్టే జరిగింది మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం తలెత్తి ఏకంగా అధ్యక్షున్ని మార్చే యత్నం సాగింది .గతంలో లక్షద్వీప పర్యటన చేసిన ప్రధాని పై మాల్దీవ్స్ లోని ముగ్గురు మంత్రులు ప్రదర్శించిన నోటీ దురుసుతో మంత్రులు పదవులు పోగొట్టుకున్న దరిమిలా ప్రస్తుతం ఆ దేశ అధ్యక్ష పీఠం కుసలు కదులుతున్నయ్
. ఇప్పటికే మాల్దీవులుకు వెళ్లే ప్రపంచ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోగా, పర్యాటక ఆదాయం తగ్గుతోందని ఆ దేశం గగ్గోలు పెడుతోంది(దేశ ఆదాయం కేవలం పర్యాటకం) పైనే. బాయ్కాట్ మాల్దీవుల నినాదం ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న వేళ- ఆ దేశం చేపట్టిన దిద్దుబాటు చర్యలు ఎలాంటి ఫలితాలు ఇవ్వడం లేదు. సరి. కథ ఆదేశ ఆర్థిక పర్యాటక పరిస్థితులపై మాల్దీవుల్లోని అధికార, ప్రతిపక్ష నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొరుగున సహాయం చేసే భారత్ ను వదిలి బీజింగ్ తో దోస్తీ చేయడమే పొరపాటు.ప్రస్తుతం దీవిలో వున్న ప్రజల్లో ప్రభుత్వం పై నిరసనలు మిన్నంటి తాజాగా మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకి చర్యలు తీసుకోవాలని ఆ దేశ పార్లమెంటరీ మైనారిటీ నాయకుడు అలీ అజీమ్ కోరారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలని సభ్యులకు పిలుపునిచ్చారు.స్థిరమైన విదేశాంగ విధానాన్ని పెంపొందిచడానికి డెమొక్రాట్లమైన తాము ప్రయత్నించామని, పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పామని, కానీ ఇప్పుడు ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయని అలీ అజీమ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇలా వుండగాపర్యటకంగా భారీ నష్టం వాటిల్లుతున్న సమయంలో దిద్దుబాటు చర్యలో భాగంగా. ముగ్గురు మంత్రులపై. అధ్యక్షుడు మొహమ్మద్ మోయేజ్ వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే వారి స్థానంలో కొత్తగా మరో ముగ్గురిని కేబినెట్ లోకి తీసుకునేందుకు ఆదివారం సభ నిర్వహించగా తీవ్ర గందరగోళం ఏర్పడి మంత్రులు సభలోనే కొట్టుకున్నారు. అడ్డు కునే యత్నం చేసిన అధ్యక్షుని పక్కకు నెట్టడం ఆయన తులి కిందపడటం జరిగిందిఈ పరిణామాల కారణంగా తాజాగా మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ పై అభిశంసన తీర్మానానికి ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ తీర్మానాన్ని.. పార్లమెంట్ లో మెజారిటీని కలిగి ఉన్న మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (MDP) తీసుకొచ్చింది. దీనికోసం MDP, డెమొక్రాట్ల భాగస్వామ్యంతో అభిశంసన తీర్మానం కోసం సంతకాలను సేకరించినట్లు తెలుస్తుంది. మాల్దీవుల పార్లమెంట్లో గందరగోళం కారణంగా నిన్న అంతరాయం కలిగించిన అధ్యక్షుడి అభిశంసన తీర్మానానికి MDP, డెమొక్రాట్ల ప్రతినిధులతో సహా మొత్తం 34 మంది సభ్యులు మద్దతు తెలిపారు. ఈ పరిస్థితుల నడుమ ఐలాండ్ దేశమైన మాల్దీవుల్లో ఎ క్షణం ఏమవుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది… కశ్చితంగా భారత అనుకూల ప్రభుత్వం తిరిగి పాగా వేయనుందని ప్రపంచ పర్యాటకులు భావిస్తున్నారు.ఎది ఏమైనా చైనా తో అంటకాగినశ్రీ లంక.లో ఆర్థిక సంక్షోభం .నేడు భారత ప్రధాని లక్ష ద్వీప పర్యటనతో బెంబేలు పడిన మాల్దీవ్స్ రాజకీయ సంకోభం నెలకొంది దీని పర్యవసానంగా నేడు భారత్ విదేశాంగ విధానం బలంగా తయారైందని మరోసారి రుజువు చేసింది మోడీ ప్రభుత్వం.
(Thovva web news)


