14వ విడత సామాజిక తనిఖీ -ప్రజా వేదిక
Thovva web news.02 Feb Friday

ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగితే ఉపేక్షించమని అధికారులు హెచ్చరించారు శుక్రవారం నరసింహులపేట మండలంలో 2021- 2023 సంవత్సరమునకు సంబంధించి చేపట్టిన ఉపాధి హామీ14వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం స్థానిక ఎంపీడీవో కార్యాలయములో నిర్వహించారు. మండలంలోని 22 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆడిట్ను చేపట్టారు. సాయంత్రం వరకు మొత్తం 13 గ్రామాలకు రూ. 2 లక్షలు 15వేల 87 రూపాయలు జరిమానా విధించినట్లు జిల్లా అడిషనల్ డిఆర్డిఓ శాంత కుమారి వెల్లడించారు. మిగిలిన గ్రామాలను రేపటి ప్రజా వేదికలో వెల్లడిస్తామని తెలిపారు.గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పనుల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో జిల్లా అధికారులు యాకూబ్, ఆదాం, ఎంపీడీవో భారతి, ఎంపీఓ సోమ్లాల్, ఏపీవో భూపాల్ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్లు,తనిఖీ బృందం, ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
