సినీ అవకాశం ఇప్పిస్తానంటు అత్యాచారం…
హైదరాబాద్లో మరో దారుణం..
Thovva web news.//9398236146*


మహానగరంలో మరో విషాద దారుణం చోటుచేసుకుంది. తన భార్య కుమార్తెపై సవతి తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే విశ్వ నగరం గా పేరొందిన హైదరాబాద్ లో మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలోనే చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం చందానగర్ ఆర్టీసీ కాలనీకు చెందిన కృష్ణారావు, ఓ మహిళను 2013లో రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు ఎదిగిన కూతురు, కుమారుడు ఉన్నారు. ఒంటరిగా పిల్లలతో వుంటున ఆమెకు నిన్ను, నీ బిడ్డల్ని బాగా చూసుకుంటానని నమ్మించి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆయన మాటలు నమ్మిన మహిళ జీవితంలో తనకు ఓ తోడు కావాలనుకొంది కానీ అదే తన కూతురు జీవితంలో శాపంగా మారుతోంది అనుకోలేదు కొంత కాలం పాటు అందరూ కలిసే వున్న
గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో విడిగా ఉంటున్నారు.అయిన అప్పడపడు మాట్లాడుకుంటూనే ఉన్నారు. యుక్త వయస్సు లో ఉన్న ఆమె కుమార్తెపై ఆ కిరాతక సవతి తండ్రి కన్నేశాడు . హాట్ స్టార్ వెబ్ సిరీస్లో నటించే అవకాశాలు ఉన్నాయని, డైరెక్టర్ను ఓసారి కలువాలని కూతురుకు చెప్పాడు. ఈనెల 1వ తేదీ మధ్యాహ్నం కుమార్తెకు ఫోన్ చేశాడు. సాయంత్రం ఆడిషన్స్ జరుగుతున్నాయని, అమీర్పేట్లోని ఓ లాడ్జీకి రావాలని తెలిపాడు.ఇదంతా నమ్మిన యువతి అతనితో కలిసి వెళ్లింది. తీరా చూస్తే అక్కడ ఎవరు లేకపోవడంతో ఇంటికి వెళ్లిపోదామని యువతి చెప్పగా, డైరెక్టర్ టీ తాగడానికి బయటకు వెళ్లాడని నమ్మించే ప్రయత్నం చేశాడు. కాసేపట్లో వచ్చేస్తారని చెప్పిన అతను గది తలుపునకు గడియ బిగించాడు. యువతిపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆ తర్వాత బాత్రూమ్లోకి వెళ్లిన యువతి అక్కడి నుంచే డయల్ హండ్రెడ్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది
.అనంతరం ఫోన్ చేసి ఏడుస్తూ తల్లికి జరిగిన దారుణం చెప్పింది. నిర్ఘాంతపోయిన ఆ మహిళ వెంటనే దివ్యాంగుడైన కుమారుడితో కలిసి లాడ్జికి పరుగున వెళ్లారు. మారు తండ్రిని పక్కకు నెట్టి గడియ తెరిచిందామె. కుమార్తె పరిస్థితి చూసిన ఆ తల్లి మనస్సు తల్లడిల్లింది. యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ మారుతండ్రికి దివ్యాంగ కుమారుడు దేహశుద్ది చేశాడు. కుమారుడిని కొట్టి.. అతని ప్లాస్టిక్ కాలును కృష్ణారావు విరగొట్టాడు. తనపై మహిళ, ఆమె కుమారుడు దాడి చేశారంటూ అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.బాధితురాలి ఫిర్యాదు మేరకు కృష్ణారావుపై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. తనపై దాడి చేశారంటూ అత్యాచారానికి పాల్పడ్డ కృష్ణారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళతో పాటు ఆమె కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచారానికి గురైన యువతిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

