నూతన అధ్యక్షులు గా వెంకట్రామ్ నర్సయ్య ఎన్నిక
Thovva web news.in 05.may.07

నరసింహుల పేట మండల కేంద్రంలో మున్నూరు కాపు కుల సంఘ గ్రామ అధ్యక్షులు రాజీనామా చేయడంతో ఈరోజు మున్నూరు కాపు మండల అధ్యక్షులు కడుదుల రామకృష్ణ ఆధ్వర్యంలో సుమారు వందమంది కుల సభ్యులు చర్చలు జరిపినారు. అనంతరం నర్సింహులపేట మున్నూరు కాపు గ్రామ సంఘం అధ్యక్షులుగా వేల్పుల వెంకట్రాంనర్సయ్య ను కోశాధికారిగా బొమ్మిశెట్టి నరసయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో ప్రధాన కార్యదర్శి గా ఎన్నుకున్న కల్లెడ మధు, కార్యవర్గ సభ్యులు గా ఎన్నుకున్న కర్ల నాగన్న, బండి రమేష్, గౌని ఉపేందర్, కడుదుల కృష్ణ, పొన్నం శ్రీకాంత్, మల్లం రాములు, ఆవుల మహేష్, తోట కేశవ్ లు యధావిధిగా కొనసాగుతారని సూచించారు. ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘం కోసం నిరంతరం పనిచేస్తామన్నారు. శిథిలావస్థకు చేరుకున్న పాత భవనం నూతన నిర్మించుటకై అహర్నిశలు కష్టపడతామని, సంఘం అభివృద్ధి కోసం తోడ్పడతామని వాగ్దానం చేశారు మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న కుల బాంధవులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి మున్నూరు కాపు సంఘం ఎన్నికలలో మాజీ అధ్యక్షులు ఆకుతోట రఘుపతి తో పాటు కడదుల చంద్రయ్య, గౌని విద్యాసాగర్, గడ్డం వెంకన్న, పొన్నం నరసయ్య, తూడి మాణిక్యం, సుంకు నరసయ్య, ఆకుతోట సోమయ్య, దబ్బెట జన్నయ్య, పొన్నం వెంకన్న, బొమ్మిశెట్టి రాములు, కాస వెంకన్న తో పాటు సుమారు 100 మంది సభ్యులు పాల్గొన్నారు.