కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన
ప్రభుత్వ విప్..
మండలంలో సోమవారం రాత్రి సుడి గాలి పర్య
Thovva web news.in. 05 Feb monaday


నర్సింహులపేట మండలం సోమవారం రాత్రి డోర్నకల్ శాశనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ సుడిగాలి పర్యటన చేశారు. రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు బొజ్జన్నపేట గ్రామంలో అకాల మ్రరణం చెందిన మెరుగు సుధాకర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్సించారు. అనంతరం భీమ్లా తండాకు వెళ్లి మరణింంచిన బానోతు హేమ్లా ఇంటికి మరియు అనారోగ్యం తో బాధ పడుతున్న బానోతు సర్వన్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్సించి సభ్యులకు దైర్యం చెప్పి ఆర్ధిక సహాయం అందించారు. బొజ్జన్నపేట గ్రామం లో ముఖ్య కార్యకర్తలతో సమావేశం అయ్యారు అక్కడ నుండి రాత్రి తొమ్మిది గంటలకు నర్సింహులపేట మండల కేంద్రంలో దొంగలు పడిన రిటైర్డ్ టీచర్ వేముల ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించినారు. వారి వెంట నర్సింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జినుకల రమేష్, మరిపెడ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘు విరారెడ్డి, ఎస్ టి సెల్ అధ్యక్షులు దస్రు నాయక్, బొజ్జన్నపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాడిపెల్లి శ్రీనివాస్, కౌసల్యదేవిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా మధుకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దాసరోజు రాజశేఖర్, జిల్లా నాయకులు యిర్రి లింగారెడ్డి, మండల నాయకులు పల్లెల్ల శ్రీనివాస రావు, పల్లెల్ల వెంగళరావు,సీనియర్ నాయకులు బొబ్బ సోమిరెడ్డి, నర్సింహులపేట గ్రామ కాంగ్రెస్ నాయకులు కొండ్రేడ్డి కర్ణాకర్ రెడ్డి,ఎరనాగి రమేష్, రేఖ అనిల్, పొన్నం రఘు, శ్రీకాంత్ రాజీవ్ యువజన సంఘ అధ్యక్షులు దోమల యాదగిరి, వంతడుపుల గ్రామ కాంగ్రెస్ పార్టీ కర్తలు తదితరులు పాల్గొన్నారు.