నియోజకవర్గంలో పలు కుటుంబాలను పరామర్శించిన
మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్
Thovva web news.in //07 feb wed…

మానుకోట నియోజకవర్గ కేంద్రంలో వుండి ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటనాని అధైర్య పడొద్దు అని పలు కుటుంభాలను పరామర్శించి మానుకోట మాజీ శాసన సభ్యులు శంకర్ నాయక్ అన్నారు . బుధవారం నియోజకవర్గాల్లోపర్యటిస్తూ ముందుగా మహబూబాబాద్ మండలం మొట్ల తండా కు చెందిన సర్పంచ్ సుమన్ గారి మాతృమూర్తి మృతి చెందగా ఈరోజు జరిగిన దశ దిన కర్మ లో పాల్గొని చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు గూడూరు మండలం చిన్నయెళ్లపురం గ్రామం హాము తండాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఈరోజు వారి స్వగృహానికి వెళ్ళి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి 10,000 వేల రూపాయల ఆర్థిక సహాయం చేసారు అనంతరం గూడూరు టౌన్ కు చెందిన సారంగ బాబు గారి భార్య అనారోగ్యంతో మృతి చెందగా వారి స్వగృహానికి వెళ్లి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు . కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలోరైల్వే ఉద్యోగి యుగెందర్ తండ్రి సంవత్సరికం కార్యక్రమంలో పాల్గొన్నారు అదేగ్రామానికి చెందిన విలేఖరి సత్యనారాయణ రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఇంటికి వెళ్ళి పరామర్శించారు అనంతరం ఉప్పరపల్లి కొమటిపల్లి గ్రామంలో పలువురు పలు ప్రమాదాలలో మృతి చెందగా వారి వారి స్వగృహాలకు వెళ్ళి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో తెళ్ళ శ్రీనివాస్, నాయిని రంజిత్, లునవత్ అశోక్, నర్సింగ్ వెంకన్న, ముత్యాల వెంకన్న, కృష్ణ, బాలు నాయక్ వెంకట కృష్ణ రెడ్డి , నూకల సురేందర్, కటార్ సింగ్, అశోక్,బాలు, మన్మోహన్ రెడ్డి, సురేష్ వీరన్న, ముత్యాలు,వేణు, యాకయ్య, నాగరాజు, మంగిలాల్, నర్సింహ, ప్రవీణ్, ఉప్పలయ్య, హరిలాల్ , హరిసింగ్, దేవసింగ్, ఎల్లయ్య (కేసముద్రం పర్యటనలో )జెడ్పీటీసీ రావుల శ్రీనాథ్ రెడ్డి గారు,నీలం దుర్గేష్, నజీర్ అహ్మద్ , కముటం శ్రీను, రవీందర్ రెడ్డి, వీరు నాయక్, మండల & గ్రామ భారాస నాయకులు పాల్గొన్నారు


