ఘనంగా పి ఆర్ టియు వ్యవస్థాపక దినోత్సవం

నరసింహులపేట ఫిబ్రవరి 08
పి ఆర్ టి యు ఉపాధ్యాయ సంఘం వ్యవస్థాపకులు శ్రీ శ్యామల యాదగిరి 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని నరసింహుల పేట మండల విద్యా వనరుల కేంద్రంలో పి ఆర్ టి యు పతాకావిష్కరణ ఏర్పాటును చేశారు. మండల ప్రధాన కార్యదర్శి కొండ సంజీవ ఆధ్వర్యంలో సీనియర్ పి ఆర్ టి యు క్రియాశీల సభ్యులు జడ్పీహెచ్ఎస్ పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయులు వెన్నం వెంకట్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు కే శ్రీనివాస్ రెడ్డి, కొంకా నరేష్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు అనుమాండ్ల వెంకటరెడ్డి. ఓ.వెంకటయ్య, వీ ప్రసాద్, పి శ్రీను, వి వీరేందర్, జి మోహన్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు.
గృహజ్యోతికి విద్యుత్ అధికారుల పరిశీలన

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అరు గ్యారెంటిల అమలులో భాగంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేసే ప్రతి గృహ జ్యోతిని మండలంలో ముమ్మరంగా విద్యుత్ అధికారులు ఆన్లైన్ నమోదు చేస్తున్నారు గృహజ్యోతి పథకం క్రింద 200 యూనిట్ల వరకు ఉచిత విధ్యుత్ పథకానికి అర్హులైన కుటుంబాలను గుర్తించెందుకు నర్సింహులపేట మండల కేంద్రములో ఏ ఇ పాండు పర్యవేక్షణ లో ఆన్ లైన్ నమోదు ప్రక్రియ మండల కేంద్రములోని పాత గ్రామ పంచాయితీ ఆవరణలో ప్రారంభం అయినది. గ్రామంలోని ప్రతీ కుటుంబం ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇచ్చిన రషీదు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు మరియు విధ్యుత్ బిల్లు తో పాటు మొబైల్ తీసుకొని వచ్చి నమోదు చేసుకోవాలని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో ఏ ఇ పాండు, సబ్ ఇంజనీర్ హరీష్ కుమార్, లైన్ మెన్ మంగీలాల్ తో పాటు కట్టర్ సుధాకర్, అశోక్ మరియు వినియోగదారులు వున్నారు. లైన్ మెన్ మంగీలాల్ మాట్లాడుతూ ఈ ఒక్కరోజు ఉదయం నుండి సాయంత్రం గం.5-30 వరకు 240 మంది వినియోగదారులను ఆన్ లైన్ లో నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
వేరుశనగ పంట అధిక దిగుబడి కి వ్యవసాయ అధికారుల సూచనలు

నర్సింహులపేట మండలంలోని వంతడుపుల గ్రామం లో వేరుశనగ పంటలను పరిశీలించడం జరిగింది. వేరుశనగ యాజమాన్యం మరియు జిప్సం వాడకంపై అవగాహన కల్పించడం జరిగింది. కార్యక్రమంలో రైతులు బానోతు నాగులు,యాకుబ్ మరియు ఏఈవోలు పాల్గొన్నారు.
వేరుశనగలో జిప్సం వాడకంవేరుశెనగ లో గంధకం పాత్ర:
గంధకం మొక్కల్లో శ్వాసక్రియకు, వేరుపైబుడిపెల అభివృద్ధికి, పత్రహరిత అభివృద్ధికి, వేరుసెనగ కాలయ రంగు అభివృద్ధికి ఆకులు ముందే రాలకుండా అరికట్టడం, మొక్కలకు కాయలు (ఊడలకు) గట్టిగా అతుక్కొని ఉండటానికి, నూనె తయారుచేసే ప్రక్రియలో ప్రముఖపాత్ర వహిస్తుంది. మొక్కలో తగినంత గంధకం ఉండటం వల్ల మాంసకృత్తులు తయారవడం, ఎంజైములు పనిచేసే సామర్థ్యం పెరిగిమొక్క దృడంగా ఉంటుందిగంధక లోప లక్షణాలు*: గంధకం లోపిస్తే చెట్టు ఆకులు పసుపు పచ్చగా మారుతాయి. > లేత ఆకులు చిన్నవిగా, రంగు కోల్పోయి నిటారుగా ఉంటాయి. అయితే ముదురు ఆకులు మాత్రమే ఆకుపచ్చగా ఉంటాయి.
*మొక్కలు గంధకం గ్రహించే విధానం:* పంటకాలంలో సుమారుగా 0.2 శాతం గంధకం వేరుసెనగ ఆకుల్లో ఉంటుంది. ఊడలు, కాయల గంధకాన్ని గ్రహిస్తాయి కాయలు పెరిగే సమయంలో తగినంత గంధకం కాని, లభ్యమయ్యేటట్లు చూడాలి. గంధకాన్ని మొక్కలు భూమి నుంచి గాక వాతావరణం నుంచి ఆకులు సల్ఫర్ డై ఆక్సైడ్గా కూడా గ్రహిస్తాయి.
*జిప్సం వేసే పద్ధతి:* కాల్షియం, గంధకం లోపం వల్ల వచ్చే లోప లక్షణాలు జిప్సం వేయటం ద్వారా అరికట్టవచ్చు. ఎకరాకు 200 కిలోల జిప్సంను పంట తొలిపూత సమయంలో కలుపు తీసేటప్పుడు, మొక్కల మొదళ్లలో పడేటట్లు వేయాలి. వర్షాభావ పరిస్థితుల్లో జిప్సంను ఊడలు దిగే సమయం అంటే రెండోసారి కలుపుతీసే సమయంలోగా వేయటం వల్ల ఊడలు కాల్షియంను గ్రహించి, కాయలు బాగా నిండుగా ఊరడానికి దోహదం చేస్తుంది.
జిప్తం వేసే సమయంలో నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. ఉప్పులను విత్తేటప్పుడు లేదా విత్తిన 25-30 రోజులకు వేయడం వల్ల లేదా 2 దఫాలుగా వేయడం వల్ల వేరుసెనగ మొక్కలు కాల్షియం, గంధకాన్ని ఎక్కువగా గ్రహించడమే గాక నత్రజని, భాస్వరం, పొటాష్ లను కూడా ఎక్కువగా గ్రహిస్తాయి. జిప్సం వేసిన వేరుసెనగలో ఇతర పోషకాలను తీసుకోవడం కూడా ఎక్కువగానే ఉంటుంది.
ఫిబ్రవరి 16సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

కేంద్ర బిజెపి అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల నిరసనగా ఫిబ్రవరి 16న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న పిలుపునిచ్చారు నర్సింహులపేట మండలం గ్రామంలో వ్యవసాయ కార్మికులను కలిసి కరపత్రాలతో ప్రచారం అనంతరం వీరయ్య మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా కేంద్ర బిజెపి ప్రభుత్వం దేశంలో అనుసరిస్తున్న ఆర్థిక మతత్వ విధానాల ఫలితంగా ప్రజల జీవన ఆదాయం పడిపోయి పేదల సంఖ్య పెరుగుతున్నదని దేశంలో 80 కోట్ల మంది దారిద్ర రేఖ దిగువన మగ్గుతున్నారని అన్నారు అందరికీ ఉద్యోగ భద్రత కల్పించి ఉపాధి చట్టాన్ని సవరించి పెంచాలని 200 రోజులకు పెంచాలని రోజుకు కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని పట్టణాలలోఉపాధి హామీ చట్టం చెయ్యాలని డిమాండ్ చేశారు ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపరిచి 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి ఆహార భద్రత చట్టాన్ని ప్రతిష్ట అమలు చేయాలని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికులు కొండ యాకయ్య కొండా పూలమ్మ ఐలోను పద్మ మల్లికాంబ జక్కుల వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు