పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి
THOVVA WEB NEWS //10 feb sat

రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దుబారా ఖర్చులకు, డాంభికాలకు వెళ్లకుండా వాస్తవ పరిస్థితులకు అద్ధం పట్టేలా వుందని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ మెుత్తం 2,75,891 కోట్లుతో బడ్జెట్ను ప్రవేశపెట్టారని చెప్పారు. బడ్జెట్లో సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా బడ్జెట్లో ఆయా రంగాలకు పెద్ద పీఠ వేశారని చెప్పారు. ఆరు గ్యారంటీల అమలకు బడ్జెట్లో 20 శాతానికి పైగా అంటే 53,196 కోట్ల నిధులు కేటాయించిందని సంతోషం వ్యక్తం చేశారు.ముఖ్యంగా ఎన్నికల హామీలను నెరవేర్చే ప్రక్రియ సాగుతుందన్నారు ఇంటర్నేషనల్ స్కూల్స్ కోసం 500 కోట్లు విద్యావిధానానికి 21 వేల కోట్లు ప్రతిపాదించడం కాంగ్రెస్ భావితరాల ఆకాంక్షలను నెరవేర్చిలా ఉందన్నారు .