2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిరు..
అంకెల గారడీ.. ప్రతిపక్షాలు కాకి గోల…
కొమురయ్య యద్గిరి తొవ్వ ముచ్చట్లు
Thovva web news.10/Feb . sat

కొమ్రయ్య బాయి కాడికి
పోనికి “తొవ్వ “పట్టిండు గీ మధ్య మనుమడు కొనిచిన్న టచ్ ఫోన్ లో యూట్యూబ్ కటిక నొక్కిండు గప్పుడే రాష్ట్ర లెక్కలు మంత్రి రాబడి అప్పులులెక్కలు పత్రాలు సదువుతుండు .6గ్యారెంట్ల ల అమలు 4 వెల పెన్షన్ గురించి చెప్తడేమోనని ఆగి చెట్టు కింద కూసోని ఇంటుడు..అప్పుడే. అటు దిక్కుపోతున్న యాద్గిరి కొమురయ్య కాడికి వచ్చి ఆయన సుత లెక్కలు ఇంటాడు యద్గిరీ కి రైతు రుణ మాఫీ గురించి గట్లనే రైతు పెట్టుబడి సాయాం గురించి ఏం చెప్తారోనని సప్పడు సేయకుండ ఇంటాడు. బడ్జెట్ లో మల్లు సార్ ముచ్చట్లు … చెప్పుడు షురూవు జేసిండు…తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్న ప్రజలకు మనస్ఫూర్తిగా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ ప్రవేశపెదుతునట్టు తెలంగాణ త్యాగమూర్తులు ఏ ఆశయాలతో ఆత్మార్పణ చేశారో వాటిని ఆచరణలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారఇస్తు అందరికోసం స్ఫూర్తితో పాలన అందిస్తున్నామన్నారు.పదేళ్ల తర్వాత నిజమైన ప్రజాస్వామ్యం ఏంటో తెలంగాణ చూస్తోందని పేర్కొన్నారు. రైతులు, మహిళలు, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చర్యలు తీసుకుంటున్నామని గట్టిగా సిప్పిండు. ప్రజలకు నిజమైన ప్రతినిధులుగా ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నమని మల్లో సారి సెప్పిండు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఈ ప్రభుత్వం ఎంతటి సాహసనికైన సిద్దం మన్నరు. నిస్సహాయులకు సహాయం చేయడమే తమ లక్ష్యమని వివరించారు.

ఏ ఏ శాఖ కు ఎంతెంత…ఇచ్చిరు?
. 2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్* *మొత్తం*
ఆరు గ్యారంటీల కోసం* రూ.53196 కోట్లు అంచనాపరిశ్రమల శాఖ రూ.2543 కోట్లు ఐటీ శాఖకు రూ.774 కోట్లు పంచాయతీ రాజ్ రూ.40,080 కోట్లుపురపాలక శాఖకు రూ.11692 కోట్లుమూసీ రివర్ ఫ్రంట్కు రూ.1000 కోట్లువ్యవసాయ శాఖ రూ.19746 కోట్లుఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ.1250కోట్లుఎస్సీ సంక్షేమం రూ.21874 కోట్లు
ఎస్టీ సంక్షేమం రూ.13013 కోట్లుమైనార్టీ సంక్షేమం రూ.2262 కోట్లు బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ.1546 కోట్లు బీసీ సంక్షేమం రూ.8 వేల కోట్లు విద్యా రంగానికి రూ.21389కోట్లు
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ.500 కోట్లు యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు
వైద్య రంగానికి రూ.11500 కోట్లు
గృహజ్యోతికి రూ.2418 కోట్లు
విద్యుత్ సంస్థలకురూ.16825 కోట్లు
గృహనిర్మాణానికి రూ.7740 కోట్లు
నీటి పారుదల శాఖకు రూ.28024 కోట్లు
కేటాఇంచారు …అన్ని చెప్పింన్లు గనీ కేసిఆర్ మొత్తం అప్పులు చేసి పోయిండని చెప్తున్నారు.. గీయాన్ని అమలుచేస్తరా అనే డౌట్ కూడా వాళ్లకు కొడుతుంది. అయిన గీసారి ఎట్లైన ఇస్త్తరు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చెయ్ కి ఓటేయలంటే వాళ్లు ఇయ్యల్సిందే అని చెప్పిండు

కొమురయ్య… గీ లోల్లి నడుస్తుంటే మధ్యలో గులాబీ పార్టీ ఒళ్ళు .. పువ్వు పార్టీ ఒళ్ళు అంకెల గారడీ చేస్తున్నారు…100రోజుల్లో పథకాలు అమలు చేయకపోతే వాళ్ళ అంతు చూస్తామని కేటీఆర్..కిషన్ రెడ్డి అంటున్నారు… ఇదంతా ఇన్న యద్గిరి మొన్న పువ్వు పార్టీ నిర్మలమ్మ పెట్టిన రాబడి లెక్కలు సుత ఇట్లనే చేసిందా అని డౌట్ కొట్టింది కొమురయ్య అయితే గులాబీ పార్టీ ఒళ్ళు ఇదివర్క్ వాళ్ళు కూడా గీట్లనే పెట్టరా అని ఇనకి డౌట్ కొట్టంది…ఇంతలో పైకెల్లి కాకి అర్సుడు సురువయ్యే సరికి అంత కాకి గోల అంటూ అందరూ ఒకటే మనమే ఏర్రిఓలం అంటు ఇద్దరు లేసి పోయిండ్రు.