ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరూ?..
పట్టించుకోవాల్సిన అధికారులు పట్టింపు లేదా
Thovva web news.//12.feb.mon

రహదారుల పక్కన వున్న వ్యవసాయ బావులతో ప్రమాదం పొంచి ఉంది. రోడ్డే కదా అని వాహనదారులు రయ్ మని వెళితే మృత్యువు కబళించడం కాయం. ప్రభుత్వం రహదారులు శాఖ బావి దగ్గర ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టడం లేదు . నర్సింహులపేట మండల కేంద్రము నుంచి వంతడుపుల స్టేజీ హైవే రోడ్డుకు వెళ్ళే రోడ్డు ఇందిరా గాంధీ విగ్రహం సమీపంలో లో మూల మలుపు లో వాడకం లో వున్న వ్యవసాయ బావి కి రక్షణ గోడలు లేవు. రోడ్డు అంచున సైడ్ కాలువ దాని అంచునే బావి. హెచ్చరిక బోర్డులు పెట్టిన దాఖలాలు లేవు. ఈరోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. రాత్రి వేళల్లో కూడా మితి మీరిన వేగం తో వాహనాలు నడుస్తుంటాయి. అదుపు తప్పితే బావిలో పడి ప్రమాదానికి గురయ్యే అవకాశం వున్నది.ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని రోడ్డు పక్కన వున్న ప్రమాదకర బావుల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టించి కొంచెం ఎత్తుగా అడ్డుగోడలు నిర్మించేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
