రాడ్ తో కిరాతకంగా కొట్టి చంపిన నిదితుడు…
Thovva news.in//Guduru.13.Feb.TUE

ప్రధాన జాతీయ రహదారిపై పట్టపగలే మంత్రాల నేపంతో ఇద్దరి దారుణంగా హత్య చేశారు.. గ్రామస్తుల కథనం ప్రకారం గూడూరు మండలం బొల్లెపల్లికి చెందిన ఆలకుంట్ల సమ్మక్క(55) ఆలకుంట్ల సమ్మయ్య(40)ఆలకుంట్ల కొమురయ్య (65)కు మంత్రాలు వస్తాయని నెపంతో అదే గ్రామానికి చెందిన శివరాత్రి కుమారస్వామి కొన్ని సంవత్సరాలుగా గొడవ పడుతున్నారు.. ఇటీవల కుమారస్వామి కుటుంబ సభ్యులు అనారోగ్యం కావడంతో ఆలకుంట్ల సమ్మక్క, కొమురయ్య, సమ్మయ్య లే మంత్రాలు చేశారని అనుమానం తో హత్య చేయాలని ప్రయత్నాలు చేస్తుండటం తో బాధితులు. భయంతో మూడు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం ఆలకుంట్ల కుటుంబ సభ్యులను శివరాత్రి కుమారస్వామిని పోలీస్ స్టేషన్ పిలిచి ఎస్సై రాణా ప్రతాప్ అవగాహన కల్పించి పంపించారు. పోలీస్ స్టేషన్ నుండి బస్టాండ్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆటోలో వచ్చిన ఆలకుంట్ల సమ్మక్క, కొమురయ్య, సమ్మయ్య లపై శివరాత్రి కుమారస్వామి రాడ్డుతో విచక్షణ రహితంగా తలపై దాడి చేశారు. ఈ ఘటనలో సమ్మక్క, కొడుకు సమ్మయ్య తల చిద్రమై అక్కడికక్కడే మృతి చెందారు. అదే రాడుతో కుమారస్వామి కొమురయ్య పై దాడి చేస్తుండగా సంఘటన స్థలం వద్ద ఉన్న యువకులు అడ్డుకుని కుమారస్వామిని బంధించి పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో తల్లి కొడుకులు అక్కడికక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలైన కొమురయ్యను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సిఐ పనిధర్, ఎస్సై రాణాప్రతాప్ ప్రవలిక, కొత్తగూడ, గంగారం ఎస్సైలు నగేష్, దిలీప్ లు సంఘటన వద్దకు చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాలను గ్రామపంచాయతీ కార్యాలయ ట్రాక్టర్ లో పోస్టుమార్టంకి తరలించడానికి ప్రయత్నించిన పోలీసులను మృతుల కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. హత్య చేసిన నిందితున్ని అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ దారుణానికి పోలీసులు నైతిక బాధ్యత వహించాలని పోలీసు నిర్లక్ష్యంతోనే హత్యలు జరిగాయని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే స్పందించి చర్యలు చేపడితే ఈ దుర్ఘటన జరిగేది కాదని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతదేహాలను నిందితుడు ఇంటివద్ద వేస్తామని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలపడంతో అంగీకరించి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.