గ్రూప్ 4 లో మార్కులు తక్కువ రావడం తో మనస్తాపం
పెద్ద ముప్పారం లో విషాద చాయలు…
thovva web news.in
నర్సింహులపేట. ఫిబ్రవరి.17.శనివారం

గ్రూప్ ఫోర్లో మార్కులు తక్కువ వచ్చాయని తీవ్ర మనస్థాపానికి గురై యువతి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హాస్టల్ లో బలవన్మరణం పాలైన ఘటనలో మహబూబాబాద్ జిల్లా పెద్ద మూప్పరం లో విషాద చాయలు అలుముకున్నాయి.వివరాల్లోకి వెళితే పెద్ద ముప్పారం గ్రామ వాసి గదరి బోయిన శిరీష (24)….జవహర్ నగర్ లోని ఎస్సార్ బాలికల హాస్టల్ లో ఉంటూ గ్రూప్ ఫోర్ కు సిద్ధమవుతున్నది.ఇటీవల ప్రకటించిన గ్రూప్ ఫోర్ ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని మనస్థాపానికి గురై హాస్టల్ లో ఉరివేసుకున్న మృతి చెందినట్టు మృతుల కుటుంబీకులకు సమాచారం అందించారుశవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు…. కేసు దర్యాప్తు….. చేస్తున్నట్టు తెలిపారు