జనాభా ధమాషా ప్రకారం ఆదివాసి లకు న్యాయం చెయ్యాలి ….
జాతీయ ఆదివాసీ అఖిల పక్ష ప్రజా సంఘాల జెఏసీ పిలుపు…
మహబాద్ పార్లమెంట్ టికెట్ ఆశిస్తూ చందా లింగయ్య దొర
Thovva web news.in//

మహబూబాబాద్ పార్లమెంట్ సీటును అన్ని పార్టీలు ఆదివాసీ సామాజిక వర్గానికే కేటాయించాలని, లేని పక్షం లో ఆదివాసీలం అందరం పార్టీలకు అతీతంతంగా ఒక్కటై. ఆదివాసీ ఆస్తిత్వం పోరాటానికి స్వేకారం చూడతామని కాంగ్రెస్పార్టీ పార్లమెంట్ టికెట్ ఆశా వహులు చందాలింగయ్య దొర డిమాండ్ చేసారు జిల్లా కేంద్రం లోని కోర్టు సెంటర్ లో ఉన్న ముత్యాలమ్మ తల్లి కి మొక్కుకున్నారు ఈ సందర్బంగా ఆదివాసిలకే అన్ని పార్టీలు టికెట్ ఇవ్వాలనే కర పత్రాన్ని ఆవిష్కరణ చేసారు ఈ సందర్బంగా లింగయ్య దొర మాట్లాడుతూ…జనాభా ధమాషా ప్రకారం మహబూబాబాద్ పార్లమెంట్ సీటు ఆదివాసీ లకు దక్కాలి కానీ వరుసగా లంబాడా జాతికి కేటాయిస్తూ.. ఆదివాసిల ఆత్మ గౌరవాన్ని కించెత్తు గౌరవం ఇవ్వడం లేదని, ఇది దారుణం అని వాపోయారు.వరుసగా లంబాడా లు పోరిక బలరాం నాయక్, అజ్మీరా సీతారాం నాయక్, మాలోత్ కవిత లకు కేటాయించారు అన్నారు దామా శా ప్రకారం లక్షా 71వేల 221 ఓట్లు ఆదివాసీ ల ఓట్లు ఎక్కువ ఉన్నాయి అయినా కానీ ఉద్దేశ్యపూర్వకంగా లంబాడాలకే కేటాయించడం అన్యాయం అన్నారు, ఇదెక్కడి న్యాయం అని నిప్పులు చేరిగారు, ఆదివాసీలు ఇప్పుడు ఐక్యత అవుతున్నాము,అన్నారు వామ పక్ష, విప్లవపార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, కవులు కళా కారులు మైనారిటీ లు మాకు జరిగే అన్యాయయాన్ని కాండించాలి అన్నారు, ఈ సారి మాకు సీటు కేటాయించని యెడల ఆదివాశీలు అందరం పార్టీలకు అతీతంగా ఒక్కటై మా అభ్యర్థి ని గెలిపించు కుంటామని అన్నారు ఈ కార్యక్రమం లో ఆదివాసీ జాక్ రాష్ట్ర ఇంచార్జి, కన్వినర్ పొడుగు శ్రీనాద్,తుడుం దెబ్బ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు ఒట్టం నారాయణ, గొండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ, మహబాద్ జాక్ కన్వినర్ తాటి జనార్దన్, భద్రాద్రి కొత్త గూడెం జాక్ అధ్యక్షులు కొమరం బుచ్చయ్య,పొలిటికల్ జాక్ రాష్ట్ర కన్వినర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు
