పార్లమెంటు గేలుపు లక్ష్యంగా జిల్లా పదాధికారుల నియామకం
తొవ్వ వెబ్ న్యూస్. 20.ఫిబ్రవరి మంగళవారం,

మహబూబాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తూ జిల్లా పార్టీ అధ్యక్షుడు యలమంచిలి వెంకటేశ్వర్ రావు తన మార్కు ను చూపిస్తున్నారు దానిలో భాగంగా జిల్లా పార్టీలో సంస్థగతంగా మార్పు చేస్తూ పార్టీ విదేయులకు పార్టీ పదవులను కట్టబెడుతూ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మెహబూబాబాద్ లో భాజపా విజయం దిశగా అడుగులు వేస్తూ ఉపాధ్యక్షులుగా వల్లభ వెంకటేశ్వర్లు, మేరెడ్డి సురేందర్,బానోత్ కృష్ణ,తోట సంపత్ కుమార్ తుంపిల్ల శ్రీనివాస్,నాగయ్య శాస్త్రి లను ,జిల్లా ప్రధాన కార్యదర్శులుగా మొసంగి మురళి, బాననోత్ శ్రీను,మాధవపెద్ది విజయ లక్ష్మి, కొలువుల శంకర్ చిట్టిమల్ల శ్రీను లను,జిల్లా కోశాధికారిగా ఒలం శ్రీనివాస్ రావు లను జిల్లా అధికార ప్రతినిధిగా ధార ఇందు భారతి, ఓబీసీ మొర్చ జిల్లా అధ్యక్షునిగా ఫైండ్ల శ్రీనివాస్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షునిగా గుగులోతు రాంబాబు.., ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షునిగా విజయేందర్, కిసాన్ మోర్చ్ జిల్లా అధ్యక్షునిగా శ్రీనివాస్ రావు లను నియమించినట్టు తెలిపారు రానున్న పార్లమెంటు ఎన్నికలో నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి గా చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు.

భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మోసంగి మురళి నీ ఎంపిక చేసినట్టు బిజెపి జిల్లా అధ్యక్షులు యలమంచిలి వెంకటేశ్వరరావు మంగళవారం ప్రకటించారు.గతంలో ఏబీవీపీ లో పనిచేసే ఏబీవీపీ మండల కన్వీనర్ స్థాయి నుంచి కాకతీయ యూనివర్సిటీ ప్రెసిడెంట్ గా ఇన్చార్జిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ పనిచేశారని అన్నారు.అనంతరం పార్టీలో చేరి పట్టణ అధ్యక్షులుగా జిల్లా కార్యదర్శిగా అసెంబ్లీ కన్వీనర్ గారు అనేక బాధ్యతలు నిర్వహించారని రాబోయే పార్లమెటులోనూ ఎన్నికలో పార్టీ గెలిపించే దిషగా యువత కు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మోసంగి మురళి మాట్లాడుతూ జిల్లా ప్రధాన కార్యదర్శి గా ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్షులు యలమంచిలి వెంకటేశ్వరరావు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బంగారు శృతి కాసం వెంకటేశ్వర్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాప సీతయ్య రాజ వర్ధన్ రెడ్డి రాచకొండ కొమురయ్య వద్దిరాజు రామచంద్ర గారికి జాటోత్ హుస్సేన్ నాయక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.నాపై నమ్మకం ఉంచి ఇచ్చిన బాధ్యతలను మంచిగా నిర్వహిస్తానని పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తానని రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేస్తానని పిలుపునిచ్చారు.

భాజపా ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షునిగా పైండ్ల శ్రీనివాస్ ను నియమించినట్టు జిల్లా అధ్యక్షుడు యలమంచిలి వెంకటేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా పైండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూతన నియామకానికి సహకరించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి రాజ్యవర్ధన్ రెడ్డి ,మాజీ జిల్లా అధ్యక్షులు యాప సీతయ్య కు మజీ కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు జయపాల రెడ్డి జిల్లా నాయకులు రాచకొండ కొమురయ్య లకు ప్రత్యేక, కృతజ్ఞతలు తెలిపారు.జిల్లాలో బిజెపి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఓబీసీ ల అభ్యున్నతికి నిర్విరామంగా కృషి చేస్తానని తెలిపారు.