చిలకల గుట్ట వద్ద స్వాగతం పలికిన రాష్ట్ర ప్రతినిధులు…
అమ్మలకు అశేష జనస్వాగతం…..
అధికార లంచనాలతో గద్దె వద్ద ప్రతిష్ట……
మేడారం…తోవ్వ వెబ్ న్యూస్ ఫిబ్రవరి 22 .





అశేష జనావాహిని ఎదురుచూస్తున్న మహోజ్వల ఘట్టం మేడారం సమ్మక్క తల్లి ఆగమనం కోట్ల మంది ప్రజానీకం అమ్మ కోసం ఎదురు చూస్తూ చిలుకలగుట్ట వద్ద భారీ సంఖ్యలో సమ్మక్క తల్లికి నీరాజనాలు పలుకుతూ స్వాగతం తెలిపారు చిలకల గట్ట నుంచి సమ్మక్క ఆగమనం ప్రారంభమైన ఘట్టం . ముందుగా పూజారులు ఆదివాసి సాంప్రదాయ పద్ధతుల ప్రకారం చిలుకల గుట్ట దగ్గర సమ్మక్కకు పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఐదు రౌండ్లు ఫైరింగ్ చేశారు. దీంతో చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి బయలుదేరి గద్దెకు చేరుకున్నరు.సుమారు మూడువేల మంది పోలీసులు రోప్ వే నడుమ ఆదివాసీ సంప్రదాయ ఢంఖలు మోగిస్తూ శివ సత్తులు పునాకలు డోలు డప్పుల మధ్యలో రాష్ట్ర ప్రభుత్వాధికారులు వెంట నడువగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ ఉన్నత అధికారులు అమ్మ వారిని గద్దె పై ప్రతిష్ఠించారు.

