గ్రామదేవత వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు.
మహబూబాబాద్, తొవ్వవెబ్ న్యూస్,24,ఫిబ్రవరి



మహబూబాద్ పట్టణంలోని( గ్రామ దేవత) బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవ వేడుకలనువేద పండితల మంత్రోత్సవాల నడుమ ఘనంగా ప్రారంభించారు . మున్సిపల్ చైర్మన్, బొడ్రాయి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రారంభమైన వేడుకల్లో ముఖ్య అతిథులుగా మహబూబాబాద్ శాసన సభ్యులు మురళి నాయక్ దంపతులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు భారత్ చంద్ర రెడ్డి ,మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఎమ్మెల్యే దంపతులు చైర్మన్ వార్డ్ కమిటీ సభ్యులు దేవత హోమర్చణలో పాల్గోన్నారు.భక్తులు ఇంటి నుంచి నిండు బిందెలతో నీళ్ళు తీసుకొని వచ్చి బొడ్రాయి దేవతకు అభిషేకాలు నిర్వహించారు.అనంతరం అమ్మవారికి ప్రత్యేక హోమాలు నిర్వహించారు భక్తులకు తీర్ధప్రసాదాలు అందించారు.పట్టణంలో మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు మాట్లాడుతూ గ్రామదేవతల ఆశీర్వాదంతో నియోజకవర్గం లోని ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో, అష్టఐశ్వరాలతో తులతుగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఘాణపురం అంజయ్య దంపతులు, పర్కాల శ్రీనివాస్ రెడ్డి దంపతులు ఎడ్ల వేణు మాధవ్ దంపతులు వార్డ్ కౌన్సిలర్లు వెన్నం లక్ష్మారెడ్డి పోతురాజు అనుమల్ల వెంకటేశ్వర్లు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

