గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు జీరో బిల్ ఇచ్చిన ప్రభుత్వ విప్
తొవ్వ వెబ్ న్యూస్. ఇన్ /నర్సింహులపేట 02. మార్చ్

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీ ల అమలులో భాగంగా శనివారం సాయంత్రం నర్సింహులపేట మండలం లోని పడమటిగూడెం గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోఉచిత గృహ జ్యోతి పథకాన్ని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రు నాయక్ ప్రారంభించి విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గృహ జ్యోతి పథకం కింద వినియోగదారులకు జీరో బిల్లుల జారీ చేసే ప్రక్రియను ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ మీటర్ రీడింగ్ 200 యూనిట్ల లోపు బిల్లు వచ్చిన వినియోగదారులకు జీరో బిల్లులు అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. లబ్ధి దారులు జక్కుల ఉపేంద్ర కుటుంబానికి జీరో బిల్లు అందించారు. ఈ సందర్భంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని తెల్లరేషన్ కార్డుతో, ఆధార్ కార్డు అనుసంధానం చేసుకున్న వారికి జీరో బిల్లులను అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నర్సింహులపేట మండలం లో మొత్తం 2,632 మంది కుటుంబాలను అర్హులుగా గుర్తించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని, కాంగ్రెస్ సర్కార్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డిఈ మధుసూదన్, ఏఈ పాండు నాయక్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇర్రి లింగారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జినకల రమేష్, ఎస్ టి సెల్ అధ్యక్షులు దస్రు నాయక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజశేఖర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిర్ర సతీష్, గ్రామ పార్టీ అధ్యక్షులు ఉప్పలయ్య,కడుదుల రామకృష్ణ, చల్లా మధుకర్ రెడ్డి, నాయకులు, కాస యాకయ్య, కార్యకర్తలు, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.జీరో బిల్లు తీసుకున్న జక్కుల ఉపేంద్ర సంతోషాన్నివ్యక్తం చేశారు
