జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
వాతావరణపరిస్థితులను దృష్టి లో పెట్టుకుని ధాన్యం భద్రపరిచే దిశగా చర్యలు వేగవంతంగా తీసుకోవాలనీ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు పై అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ లెనిన్ వత్సల్ టొప్పో ,అదనపు కలెక్టర్ రెవెన్యూ డేవిడ్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2023-24 రబీ సీజన్లో జిల్లాలో మొత్తం కొనుగోలు కేంద్రాలు 192 ఉండగా అందులో ధాన్యం సేకరణ 102 కొనుగోలుకేంద్రంల ద్వారా 4909 మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు.ఇప్పటి వరకు 24,658 మెట్రిక్ టన్నులు సేకరించడం జరిగిందని,దాని విలువ 54.27 కోట్లు ఉంటుందని అన్నారు.తూకం వేసిన ధాన్యాన్ని సంబంధిత మిల్లర్లకు రవాణా చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ధాన్యాన్ని వర్షాలకు తడవకుండా ఉండేందుకు టార్పాలిన్లను ఉపయోగించాలని అన్నారు.ధాన్యం సేకరణకు తగినన్ని లారీలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఖరీఫ్ 2023-24 సంబంధించిన ధాన్యం మిల్లుల ద్వారా మరాడించి బియ్యం త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఆర్డిఓ అలివేలు, తొర్రూర్ ఆర్డిఓ నరసింహారావు, డిఎం సివిల్స్ కృష్ణవేణి, డి సి ఓ వెంకటేశ్వర్లు,డి ఎస్ ఓ రాజేందర్, డీఈఓ అభిమానులు మెక్మా విజయ ఐకెపి నళిని లు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు


ఉపాది హామీ పనులను, పని ప్రదేశం పరిశీలించిన ప్రత్యేక పరిశీలకులు
Thovva web news. May 16 Thu;
గురువారం మహబూబాబాద్ మండలం లోని గడ్డి గూడెం తండ, మరిపెడ మండలం బాల్య తండ గ్రామపంచాయతీ లలో EGS పని ప్రదేశాలను సందర్శించడం జరిగింది. అనంతరం మధ్యాహ్నం IDOC కార్యాలయం నందు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ లెనిన్ వత్సల్ టోప్పో అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారుఈ సందర్బంగా మెంబర్ సెక్రటరీ మాట్లాడుతూ “EGS పని ప్రదేశం నందు గ్రామ పంచాయతీ ద్వారా మౌళిక సౌకర్యాలు (నీడ, నీరు, ప్రథమ చికిత్స పెట్టె) కల్పించాలని, అదేవిధముగా ప్రతి కూలీకి రోజుకు 300 రూపాయలు కూలీ పడే విధముగా పని చేయించాలని ఆదేశించారు”. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ,”ప్రతి ఎంపిడిఓ గ్రామ స్థాయిలో MGNREGS parametre లపై ప్రణాళికలు సిద్ధం చేసుకొని కూలీలకు గరిష్ఠ వేతనం పడేలా తగు చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించడం జరిగింది”.జడ్.పి. సి.ఇ.ఓ మాట్లాడుతూ,”EGS పని ప్రదేశం నందు పని కొలతలను ముందస్తుగా మార్కింగ్ చేసి, పని చేయించాలని తెలపడం జరిగింది”. జిల్లా పంచాయతీ అధికారి హరి ప్రసాద్ మాట్లాడుతూ,”EGS నందు నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్ లను పూర్తి స్థాయిలో ఉపయోగములోకి తీసుకురావాలని తెలపడం జరిగింది.”ఈ కార్యక్రమంలో Addl.DRDO శాంతకుమారి, అంబుడ్స్ పర్సన్ ఆదెం,అబేద్ ఖాన్, ఎంపిడిఓ లు, ఎంపీవో లు, ఏపిఓ లు, ఈసీ లు, సాంకేతిక సహాయకులు, DRDA సిబ్బంది పాల్గొన్నారు.


దోమల నివారణ చర్యలు చేపట్టి డెంగీ నిర్మూలనకు ప్రతిజ్ఞ చేద్దాం
జిల్లా వైద్య అధికారి కళావతి భాయ్
Thovva web news.in mahabubabad may 16 Thu;
నేడు జాతీయ డెంగీ నిర్మూలన దినోత్సవం ను పురస్కరించుకొని మహబూబాబాద్ పట్టణ ఆరోగ్య కేంద్రం లో ఏర్పాటు చేసిన సమావేశం లో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.కళావతి బాయి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి ప్రజారోగ్యానికి పెను సమస్యగా మారిందని ప్రజలు, ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు కలిసికట్టుగా కృషిచేస్తేనే నియంత్రించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఎందుకంటే, ఇది మానవ ప్రేరేపిత వ్యాధి. దోమల వృద్ధికి అనుకూల మైన పరిస్థితులను మనుషులే సృష్టిస్తు న్నారని అందువల్ల డెంగీ పీడ వదిలిపోవాలంటే దోమల నియంత్రణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, దోమలు వృద్ధి చెందకూడదంటే ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని. పాత టైర్లు, కొబ్బరి చిప్పలు వంటివి ఇంటి చుట్టుపక్కల ఉండకూడదని, ఇంట్లో దోమలు కుట్టకుండా పొడుగు చేతుల చొక్కాలు, ప్యాంట్లు ధరించాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. ఇలాంటి జాగ్రత్తలపై క్షేత్ర స్థాయిలో పనిచేసే వైద్య సిబ్బంది వాడవాడలా విస్తృతంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కీటక జనిత వ్యాధుల నియంత్రణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదిక ప్రకారం గడిచిన రెండు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా 52 లక్షల డెంగీ కేసులు నమోదయ్యాయని. ఏటా నలభై వేల మందిదాకా దీని మూలంగా మృత్యువాత పడుతున్నారని, ఆగ్నేయాసియా దేశాల్లో డెంగీ విజృంభణ తీవ్రంగా ఉందని, భారత్ లో దోమలు, ఇతర కీటకాల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణ కేంద్రం లెక్కల ప్రకారం, గత ఆరు సంవత్సరాల్లో పదకొండు వందల మంది డెంగీ బారిన పడి ప్రాణాలు కోల్పోయారని, ఎనిమిది లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయని ఇందులో ఎనిమిది శాతం కేసులు తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నాయని పేరుకొన్నారు. డెంగీ నివారణ, నియంత్రణలో ప్రజలకు భాగ స్వామ్యం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఏడేళ్ల క్రితం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని, ఈ క్రమంలో నే ఏటా మే 16ను జాతీయ డెంగీ నిర్మూలన దినోత్సవంగా జరుపుకోవాలని ఈ సంవత్సరo స్లొగన్ “సమాజం తో భాగస్వామ్యమై – డెంగ్యూ ను నివారించుదాం.” అని నిర్ణయించిందని ఆయన తెలిపారు.డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అంబరీష మాట్లాడుతూ డెంగీ వ్యాధికి ఇప్పటివరకు కచ్చితమైన ఔషధం, టీకా అందుబాటులో లేవని డెంగీ సోకిన వారిని కుట్టిన దోమలు, ఇతరులను కాటు వేసినప్పుడు ఈ వ్యాధి వారికి వ్యాప్తి చెందే అవకాశం ఉందని, అందువల్ల డెంగీ బారిన పడినవారు తప్పనిసరిగా దోమతెరల్లోనే నిద్రించాలని. డెంగీ వ్యాధి సోకిన 60శాతంవ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవని ఇలాంటి వారి ద్వారా వ్యాధి ఇతరులకు వ్యాపించే అవకాశం ఉందని అందువల్ల డెంగీ విజృంభించిన ప్రాంతాల్లో విస్తృతంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో లో ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాగేశ్వర్ రావు, తీగల వేణి వైద్యాధికారి డాక్టర్ రాంబాబు, పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ విజయ్ కుమార్, బస్తీ దవాఖాన అధికారి డాక్టర్ శివ, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, ఇన్ చార్జ్ డిపిహెచ్ఎన్ఓ మంగమ్మ, ఆరోగ్య విద్యా బోధకులు పురుషోత్తo , సబ్ యూనిట్ ఆఫీసర్ గోపిచంద్, ఎంపిహెచ్ఈఓ వొబిలిశెట్టి రామకృష్ణ, హెల్త్ విజిటర్ రత్నకుమారి, పట్టణ ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఆశ కార్య కర్తలు తదితరులు పాల్గొన్నారు.

అమ్మ ఆదర్శ పాఠశాల పనులు విద్య సంవత్సరం ప్రారంభం వరకు పూర్తి కావాలి..
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
Thovva web news.in mahabubabad may 16 Thu;
గురువారం ఐ డి ఓ సి కాన్ఫరెన్స్ హాల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పర్యవేక్షణ పై జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ లెనిన్ వత్సల్ టోప్పో తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమీక్ష సమావేశం లో జిల్లాలో ఎంపిక అయిన అమ్మ ఆదర్శ పాఠశాలలు 438 కాగా అందులో 432 గ్రౌండింగ్ అయ్యాయని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులు ఏ మేరకు పనులు గ్రౌండింగ్ అయ్యాయో తెలుసుకొనుటకు మండలాల వారిగా టీమ్ లు తయారు చేసి రిపోర్ట్ సేకరించాలని అన్నారు. చేపట్టిన పనులన్నీ పాటశాలలు ప్రారంభమునకు ముందు గానే పూర్తి చేయాలని, పనులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈఈ తానేశ్వర్, డి ఈ ఓ రామారావు, ప్లానింగ్ కో ఆర్డినేటర్ పూర్ణ చందర్, మరియు సంబంధిత శాఖల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు

.రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..
మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్..
Thovva web news.in mahabubabad may 16 Thu;
రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం నుంచి తప్పుకోవాలని మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ ఆన్నారు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు రైతువ్యతిరేక చర్యలకు నిరసనగా మహబూబాబాద్ నియోజకవర్గంలోని కేసముద్రం మండల కేంద్రం లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో….పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పై దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో నీలం దుర్గేష్,కముటం శ్రీనివాస్ ,యాకూబ్ రెడ్డి,మోడెం రవీందర్, రవీందర్ రెడ్డి, వీరు నాయక్,గోపి, భద్రాద్రి, నరేష్, వెంకన్న, భారాస నాయకులు తదితరులు ఉన్నారు.

మరిపెడలో గాలివాన బీభత్సం
రూప్ సింగ్ తండాలో లేచిపోయిన ఇంటి పై కప్పు గిరిజన మహిళలకు గాయాలు
Thovva web news.in mahabubabad may 16 Thu;
గురు వారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. మంండలంలోని చింతలగడ్డతండా గ్రామ పంచాయతీ పరిధిలోని రూప్ సింగ్ తండాలో బానోతు రమేష్. శారదలకు చెందిన ఇంటి రేకులు గాలిదుమారానికి లేచిపోయి ఓ వేపచెట్టుమీద పడ్డాయి. వర్షానికి ఇంట్లో ఉన్న బియ్యం. ధాన్యం. టీవీ, బీరువా, బట్టలు తడిసి ముద్దయ్యాయి. గ్యాస్ పోయి, సీలింగ్ ప్యాన్ విరిగిపోయింది. దీంతో రాత్రి వేళ మొత్తం కుటుంబం వర్షం, చలితో వనికిపోయారు. అదేతండాకు చెందిన అజ్మీర రమేష్, సైదమ్మలకు చెందిన ఇంటి ముందు సిమెంట్ రేకల షెడ్డు లేచిపోయింది. సిమెంట్ రేకులు విరికి వరండాలో నిద్రిస్తున్న రమేష్, సైదమ్మ దంపతులపై పడడంతో సైదమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధిత కుటుంబాలను మాజీ సర్పంచ్ పాకనాయక్. రాజు నాయక్ సందర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆధుకోవాలని వారు డిమాండ్ చేశారు.