
ఔట్ సోర్సింగ్ కాలపరిమితి పునరిద్దరంచాలి అంటు బాధితురాలు కార్యాలయంలో బైఠాయింపు….
Thovva web news.20 may .mon
జిల్లా విద్య శాఖ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పార్వతి కన్నీటి పర్యంతం అయ్యారు తను గత మూడు సంవత్సరాలుగా ఇదే కార్యాలయంలో పనిచేస్తున్నానని ఈ ఏడాది తన కాల పరిమితి పూర్తయిన వెంటనే రెన్యువల్ చేయాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారి రెన్యువల్ చేయకుండా తనను మానసికంగా శోభ పెడుతున్నాడని వాపోయారు గతంలోనూ ఇదే మాదిరిగా వేధింపులకు గురి చేశాడని,, తను పేదరాలినని ఈ ఉద్యోగం చాలా అవసరమని దయచేసి తననూతిరిగి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ కార్యాలయంలోనే కింద కూర్చొని నిరసన తెలిపారు.

దేవాదాయ భూములను కాపాడాలి.
ఎండోమెంట్ శాఖ పరిశీలకులు నందనం కవిత
Thovva web news.20 may .mon
మరిపెడ మండలం అబ్బాయి పాలెం గ్రామంలో శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయ భూములను కాపాడుకోవాలని ఎండోమెంట్ శాఖ పరిశీలకులు నందనం కవిత గ్రామస్తులకు సూచించారు. సోమవారం దేవుని భూముల కౌలు వేలంపాటకు హాజరైన ఆమెకు ఆలయ పూజారి ప్రసాద్ స్వాగతం పలికారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన వేలంపాటలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 285 సర్వే నెంబర్లు 14 ఎకరాల 25 గుంటలు, 290 సర్వే నెంబర్లు ఏడు ఎకరాలు, 291 సర్వే నెంబర్లు 7 ఎకరాల 5 గుంటలు, 292,294,295,296 సర్వే నెంబర్లలో ఆరు ఎకరాల రెండు గుంటలు వ్యవసాయ భూమి కలదు అన్నారు. అయితే ఈ భూములలో గతంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు మట్టి తవ్వకాలు, జరిపారని అలాంటి చేసినట్లయితే దేవదాయ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలి
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు పటిష్ట చర్యలు చేపట్టాలి..
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్*
Thovva web news.20 may .mon
పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నోడల్ అధికారులను ఆదేశించారు.సోమవారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాలు నందు అదనపు కలెక్టర్లు లోకల్ బాడీస్, రెవెన్యూ లెనిన్ వత్సల్ టొప్పో, డేవిడ్ లతో కలిసి సంబంధిత నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 4న నిర్వహించనున్న పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్ ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారి పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి ఓట్ల లెక్కింపు టేబుల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు సిబ్బందిని నియమించాలన్నారు. పాత్రికేయుల కొరకు మీడియా సెంటర్ లో అవసరమైన చర్యలు చేపట్టాలని, కౌంటింగ్ సిబ్బంది వాహనాల పార్కింగ్ కు స్థలాన్ని పరిశీలించాలని, అధికారుల మొబైల్ ఫోన్స్ డిపాజిట్ కౌంటర్ ఏర్పాటు చేయాలన్నారు.మే.27 న జరగనున్న వరంగల్ -ఖమ్మం -నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్ కు జిల్లాలోని 34,933 ఓటర్లకు గాను 36 పోలింగ్ స్టేషన్లలో అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని, సెక్టార్ అధికారులు ప్రతీ పోలింగ్ స్టేషన్ ను తనిఖీ చేయాలని ఏవైనా సమస్యలు ఉంటే త్వరగా పరిష్కరించాలని అన్నారు ఈ సమీక్షా సమావేశంలో మహబూబాబాద్, తొర్రూరు ఆర్డీఓ లు ఎల్.అలివేలు, నరసింహారావు,డిప్యూటీ సీ.ఈ.ఓ నర్మద, మత్స్య శాఖ అధికారిణి నాగవాణి, డి.ఏ.ఓ హరిప్రసాద్, సి.పి.ఓ సుబ్బారావు, డి.డి.గ్రౌండ్ వాటర్ అధికారి సురేష్, ఏ.డి.సర్వే ల్యాoడ్ అధికారినరసింహమూర్తి,ఎం.ఆర్.ఓ లు సైదులు, భగవాన్ రెడ్డి, ఎలక్షన్ సూపరింటెండెంట్ పవన్ కుమార్,మాస్టర్ ట్రైనర్స్ రాములు, ప్రవీణ్, ఎన్నికల విభాగం సిబ్బంది గణేష్ , సందీప్, రంజిత్ పాల్గొన్నారు.

పట్టభద్రులు భాజపాను ఆదరించాలి…
ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి…
Thovva web news.20 may .mon.
పట్టభద్రులు తమ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు హక్కును భాజపాకు వేయాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పిలుపునిచ్చారు సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాజపానే పట్టబదులు ఆదరించాలని రానున్న కాలంలో దేశంలో మోడీ మరోసారి ప్రధాని నిరుద్యోగ సమస్యని పూర్తిగా నిర్మూలిస్తాడని రాష్ట్రంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు పార్టీలు ప్రజా కట్టక పార్టీలని అన్నారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి సీతారాం నాయక్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు జిల్లా అధ్యక్షులు ఎలమంచిలి వెంకటేశ్వరరావు టౌన్ అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఆసుపత్రికి వచ్చిన ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలి
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.కళావతి బాయి*
Thovva web news.20 may .mon
ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంల కు విచ్చేయు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళావతి బాయి పేర్కొన్నారు. సోమవారం కంబాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఈదుల పూసల పల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరమును ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడి సిబ్బందికి తగిన ఆదేశాలు సూచనలు జారీ చేశారు12 వారాల్లోపు గర్భిణీ స్త్రీలను నమోదు చేయాలని, గర్భిణీ స్త్రీలకు మొదటి, రెండు పరీక్షలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారితో చేయించాలని, మూడు నాలుగు పరీక్షలు జిల్లాలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఉన్న స్త్రీ వైద్య నిపుణుల తో చేయించుకునేల అవగాహన కల్పించాలని, సి- సెక్షన్ల ప్రసవాలను తగ్గించి, సాధారణ ప్రసవాల సంఖ్య పెంచే విదంగా ప్రజలలో అవగాహన కల్పించాలని, ఔట్ పేషెంట్ సేవలను మెరుగు పరుచాలని ఆమె తెలిపార ఈ కార్యక్రమంలో డిప్యూటీ మాస్ మీడియా ఆఫీసర్ కొప్పు ప్రసాద్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ సౌజన్య ఆరోగ్య కార్యకర్త గోవిందమ్మ, సరిత ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ జన్మదిన వేడుకలు క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు నాయకులు అభిమానుల నడుమ ఘనంగా నిర్వహించారు . ఉదయం నుంచి క్యాంపు కార్యాలయానికి కార్యకర్తల పెద్ద సంఖ్య హాజరై తమ అభిమానాన్ని చాటుకున్నారు. మధ్యాహ్న సమయంలో కేక్ కట్ చేసి శాలువలు బొకెలు అందించి శుభాకాంక్షలు తెలిపారు తమ నాయకుడు శత సంవత్సరాలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
27 వార్డులో అన్నదానం…
మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్ ఆధ్వర్యంలో 27వ వార్డు లో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ప్రజలకు పంచి పెట్టారు. అనంతరం కార్యకర్తలు నాయకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అక్రమ ఇసుక రవాణా…
సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు…
Thovva web news.20 may .mon
నెల్లికుదురు, మండలంలోకాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేతలకు ఇసుకఅక్రమ రవాణా వరంగా మారిందని బారాస మండల అధ్యక్షులు పరిపాటి వెంకట్ రెడ్డి ఆరోపించారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆకేరు పరివాహక ప్రాంత గ్రామాలైన మేచరాజుపల్లి, ఎర్రబెల్లి గూడెం, రామన్నగూడెం, నెల్లికుదురు, బ్రాహ్మణ కొత్తపల్లి, మునగల వీడు, మదనతుర్తి గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యదేచ్చగా ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తున్నారని, వారికి స్థానిక అధికారులు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. ఇసుక రీచ్ ల వద్ద పోలీసులే కాపలాగా ఉంటూ రవాణాకు సహకరిస్తున్నారని వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.