
టిఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ మల్లారెడ్డి
Thovva.web. May 22. Wed.
విద్యార్థులకు విద్యానేర్పాల్సిన ఉపాధ్యాయులు విద్యేతరా పనులలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉపాధ్యాయులను తిరిగి పాఠశాలలకు పంపించాలని టిఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి ఎస్ మల్లారెడ్డి , జిల్లా అధ్యక్షులు ఏ మురళీకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కె యాకూబ్ లు జిల్లా కలెక్టర్ కు బుధవారం మెమోరాండం సమర్పించారు.ఈ సందర్బంగా రాష్ట్ర కార్యదర్శి ఎస్ మల్లారెడ్డి మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు విద్యేతర పనులలో పాల్గొనొద్దు అని ఉన్న కొంతమంది ఉపాధ్యాయులు అనేక సంవత్సరాలుగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో, మరియు ఇతర శాఖలలో ఏళ్ల తరబడి తిష్ట వేసి పనిచేస్తున్న జిల్లా విద్యాశాఖధికారి దృష్టికి తీసుకొచ్చిన చోద్యం చూస్తున్నరన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మూతపడిన పాఠశాలలను సైతం తెరిపించి ప్రభుత్వ విద్యను పటిష్టం చేస్తామనడాన్ని స్వాగతిస్తున్నాం అన్నారు. దీనికనుగుణంగా జిల్లా విద్యా శాఖాధికారి గారు విద్యా సంవత్సరం ప్రారంభం లోనే మూతపడిన పాఠశాలలను తెరిపించి విద్యాశాఖ, ఉపాధ్యాయుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలన్నారు. సబ్జెక్ట్ టీచర్స్ లేక విద్య కుంటుపడుతున్నందున అక్రమ డిప్యుటీషన్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరిని ఈ విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే వారి సొంత పాఠశాలలకు పంపించాలని కలెక్టర్ గారికి ప్రాతినిద్యం చేశామన్నారు. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందిస్తూ, డిప్యుటీషన్లను రద్దు చేస్తామన్నారు.

కిసాన్ సెల్ మండల అధ్యక్షులు పూర్ణచందర్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం
మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు
Thovva.web. May 22. Wed.
ఇటీవలే మృతి చెందినకిసాన్ సెల్ మండల అధ్యక్షుడు సలుగు పూర్ణచందర్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మాజీ జెడ్పిటిసి సభ్యులు హెచ్ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఆయన స్వగృహానికి కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు తోట వెంకన్న, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మరి కుంట్ల మౌనేందర్ లతో కలిసి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మృతి తో ఒక నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునే విధంగా తమ వంతు కృషి చేస్తామన్నారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రత్నపురం యాకయ్య, సీనియర్ నాయకులు పులి వెంకన్న, మాజీ ఉపసర్పంచ్ గుండ్లపల్లి యాకయ్య గౌడ్, యువజన నేత వెన్నం క్రాంతి రెడ్డి, పులి నరసయ్య, సలుగు హనుమంతు, ఆకుల కొమురెల్లి, పాము వెంకన్న, గుండెబోయిన మల్లయ్య తదితరులు ఉన్నారు.

పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలు చేపట్టే పనులు వేగవంతం చేయాలి
జెడ్పి సీఈవో నర్మద
Thovva.web. May 22. Wed.
పాఠశాలలలో మౌలిక వసతులు కల్పనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీలను నియామకం చేసిందని ఆ కమిటీలు చేపట్టే పనులను వేగవంతం చేయాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నర్మదా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని వావిలాల, బంజారా,రావిరాల, దుర్గ భవాని తండా, మదన తూర్తి, మునిగల వీడు, పార్వతమ్మ గూడెం గ్రామాలతో పాటు మండల కేంద్రమైన నెల్లికుదురు లో పాఠశాలలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాలలలో మౌలిక వసతులు కల్పన జరగాలన్నారు. అందుకు సంబంధించిన నిధులు మంజూరు అయ్యాయని కమిటీలు సమన్వయంతో పనులు పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఈ పరిశీలనలో ఆమె వెంట ఎంపీడీవో బాలరాజు, ఎం పి ఓ బండారి పార్థసారథి గౌడ్, పంచాయతీ ఏఈ రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శులు కొచ్చర్ల వెంకటేశ్వర్లు, నాగజ్యోతి, అరుణ, కృష్ణ ప్రసాద్, అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు తదితరులున్నారు.
దామరవంచ ఇంటర్ గురుకులానికి ప్రవేశాలు
Thovva.web. May 22. Wed.గూడూరు మండలం దామరవంచ గిరిజన బాలుర గురుకుల ఇంటర్ కళాశాల ప్రవేశాలకు ఈనెల 23న ఏటూరు నాగారం గురుకుల పాఠశాలలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ముత్తయ్య తెలిపారు.గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల( బాలురు) దామరవంచ యందు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము ప్రవేశం కొరకు ఎంపీసీ బైపిసిలో స్పాట్ అడ్మిషన్స్ 23 న ఏటూరునాగారం గురుకుల పాఠశాలలో ఏర్పాటుచేసిన కౌన్సిలింగ్ కు ఒరిజినల్ టీసీ, స్టడీ సర్టిఫికెట్స్, కులము, ఆదాయము, నివాస ,ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ కార్డు, పాస్ ఫోటో తో హాజరు కావాలన్నారు.ఉచిత విద్య, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ , నాణ్యమైన భోజనము , ఉచిత బట్టలు ,దుప్పట్లు, కబడ్డీ క్రీడ యందు ప్రత్యేక శిక్షణ,కాలేజీ స్థాపించిన నుండి అనుభవజ్ఞులైన అధ్యాపకులతో బోధన చేస్తూ 100 శాతం ఫలితాలను సాధిస్తూ రాష్ట్ర స్థాయి లో స్థానం సంపాదించి ముందంజలో ఉన్న గురుకులం దామరవంచ గురుకులం అన్నారు.

బ్రహ్మోత్సవాలకు విరాళం
Thovva.web. May 22. Wed.
శ్రీలక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల కైంకర్యాల కోసం రావుల శ్రీరామ్ రెడ్డి, సురేందర్ రెడ్డి, యుగేందర్ రెడ్డి సోదరులు వారి అమ్మ నాన్న ల(కీర్తిశేషులు రావుల లక్ష్మారెడ్డి సుమిత్ర జ్ఞాపకార్థం) రూ.21.116 ఆలయ కమిటీ సభ్యులకు బుధవారం అందజేశారు. ఈనెల 23న జరిగే శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలకు అందజేసినట్లు రావుల సోదరులు తెలిపారు..

పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలి.,
మొదటి ప్రాధాన్యత ఓటు రాకేష్ రెడ్డికి అందించాలి…
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్..
Thovva.web. May 22. Wed.
పట్టభద్రులు తమ అమూల్యమైన ఓటు హక్కును ఆలోచించి వినియోగించుకోవాలని భారత రాష్ట్ర సమితి అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యతతో గుర్తించాలని రాష్ట్ర మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పట్ట భద్రులకు పిలుపునిచ్చారు బుధవారం జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచార సన్నాక సమావేశంలో మాట్లాడుతూ గతంలో బి ఆర్ ఎస్ పాలనలోనే ప్రజల కష్టాలు పోయాయని ఆరు నెలల కాంగ్రెస్తో ప్రజలు బాగా కష్టపడుతున్నారని రైతులు ధాన్యం కొనుగోలు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తికి ఓటు వేస్తే ఆ ఓటుకు విలువ ఉండదాని గతంలో కాంగ్రెస్ పార్టీని విమర్శించి మల్లన్న కాంగ్రెస్ నుంచి ఎలా పోటీ చేస్తారని అన్నారు టిఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఉన్నత విద్యావంతులని ఆయన లాంటి వ్యక్తి చట్టసభల్లోకి వెళితే పట్టబదులకు న్యాయం జరుగుతుందని అన్నారు. పట్టభద్రులు మరోసారి ఆలోచించి మొదటి ప్రాధాన్యతను బిఆర్ఎస్కే వేయాలని ఉద్బోధించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ కుమార్ బిందు, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి వైస్ చైర్మన్ వెంకన్న బిఆర్స్ నాయకులు గద్దె రవి గోగుల్ రాజు, వార్డ్ కౌన్సిలర్ మార్నేని శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీగా మల్లన్న ను మెజార్టీతో గెలిపించాలి
Thovva.web. May 22. Wed.
నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ మానుకోట పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరిపురపు వీరన్న అన్నారు. బుధవారం గూడూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల శాఖ అధ్యక్షుడు చిట్టి వెంకన్న అధ్యక్షత జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల, పట్టభద్రులైన ఓటర్లతో నిర్వహించిన కార్యక్రమంలో వీరన్న మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకైనా తీన్మార్ మల్లన్న మెజార్టీతో గెలిపించడం కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పట్టభద్రుల వద్దకు వెళ్లి ఓటును అభ్యర్థించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలుగా ప్రచారం ఉండదని ప్రతి ఓటరు కలిసి ఓటు కోరాలన్నారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మానుకోట జిల్లా కోఆర్డినేటర్ కొమ్ము వేణు, అధికార ప్రతినిధి బాలు నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వాంకుడోత్ కొమ్మలు, రాసమల్ల యాకయ్య, కోమండ్ల రమణారెడ్డి, గోపిశెట్టి శ్రీనివాస్, మాజీ సర్పంచులు రవి సింగ్ రాథోడ్, మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.

నేడు మానుకోటలో తీన్మార్ మల్లన్న ఎన్నికల ప్రచారం….
Thovva.web. May 22. Wed.
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గురువారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు ఉదయం ఎన్టీఆర్ స్టేడియం జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో వాకర్స్ తో మాట్లాడి మద్దతు అడగనున్నారు అనంతరం జిల్లాలోని ఒక ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడి పట్టభద్రుల ఓట్లను అభ్యర్థించినున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ తీన్మార్ మల్లన్న జిల్లా టీం అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ నేతృత్వంలో జరగనున్నట్లు తెలిపారు.

అక్రమ వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు,,
75 క్వింటాల నల్ల బెల్లం 7.5 క్వింటాళ్ల పట్టిక స్వాదీనం,
ముగ్గురు అరెస్ట్ ఇద్దరు పరారు,,
Thovva.web. May 22. Wed..
అక్రమ వ్యాపారాలు చేసేవారు ఎంతటి వారైనా వదిలేదే లేదని వారిపై కఠిన చర్యలతో పాటు పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని కురవి ఎస్సై గోపి అన్నారు. జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ ఆదేశాల మేరకుబుధవారం ఉదయం కురవి పోలీస్ స్టేషన్ పరిధిలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రమౌళి తో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా మరిపెడ బంగ్లా వైపు నుంచి మహబూబాబాద్ వైపు అతివేగంగా వస్తున్న నెంబర్ ఏపీ 36x 4536 గల లారీ ని ఆపి చూడగా నల్ల బెల్లం పట్టిక ఉన్నదని గ్రహించి లారీలో ఉన్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. మరో ఇద్దరు పరార్ లో ఉన్నట్లు ఆయన తెలిపారు. బెల్లం పట్టిక విలువ ఆరు లక్షల 75 వేల రూపాయలు ఉంటుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిషేధిత బెల్లం ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా నుంచి తీసుకొస్తున్నట్లు తెలిపారు. అరెస్టు అయినవారు (1) కురవి రేకుల తండా కు చెందిన గూగులోత్ అశోక్, అశోక్ మీద ఆరు కేసులు ఉన్నట్లు తెలిపారు. (2) కురవి మండలం బలపాల లింగ్యా తండా కు చెందిన మాలోత్ వెంకటేష్ ఇతని మీద ఒక కేసు ఉన్నట్లు తెలిపారు. (3) లారీ ఓనర్ కం డ్రైవర్ మారపల్లి విద్యాసాగర్,మంచిర్యాల, అనంతరం ఎస్ఐలు మాట్లాడుతూ కొరవి మండలంలో అక్రమ వ్యాపారాలకు తావు లేకుండా చేస్తామని అన్నారు. బియ్యం వ్యాపారులపై కూడా ఉక్కుపాదం మోపుతున్నట్లు ఆయన తెలిపారు. వీరిపై పీడియఫ్ నమోదు చేస్తామని పేర్కొన్నారు. మొక్కలు నల్ల బెల్లం పట్టుకున్నందుకు ఎస్పీ కురవి ఎస్సై గోపి, సిసిఎస్ ఎస్సై చంద్రమౌళి లను అభినందించినట్లు తెలిపారు. సిబ్బంది బాలు. రామకృష్ణ. దిలీప్ నాయకులను. ఎస్పీ అభినందించారూ.