కామ్రేడ్ లింగన్న కు విప్లవ జోహార్లు….
Purushotham correspondent
Thovva webnews. ఇన్

కామ్రేడ్ లింగన్న ఆదివాసి ముద్దుబిడ్డ. చిన్నతనం నుండి శ్రీ శ్రీ చెప్పినట్లు చిరకాలం జరిగిన మోసం ,బలవంతుల దౌర్జన్యాలు ,ధనవంతుల పన్నాగాలు ఇంక నా? ఇకపై చెల్లవు. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ఒక జాతిని మరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకా నా?, ఇకపై సాగకూడదని భావించాడు .అందుకే గోదారిలో యలో వలసవాద భూస్వామ్య దోపిడి అణచివేతకు జవాబుగా సుదీర్ఘకాలం తర్వాత పెళ్లుబికిన శ్రీకాకుళం, గోదావరిలోయ ప్రాంతాల్లో మూలవాసీల రైతాంగ సాయుధ పోరాటాలు బ్ర ద్దలై కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలో లక్షలాది ఎకరాల భూములను స్వాధీనం చేసుకొని అనుభవిస్తున్న ప్రజలపై ప్రభుత్వం, ఫారెస్ట్ అధికారులు ,భూస్వాముల గుండాల, పోలీస్ దాడులను అణీచివేతలను సాయుధంగా ప్రతిఘటిస్తూ విరోచితంగా పోరాడుతున్న సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీలో కార్యకర్తగా చేరి ఆ తర్వాత 1997లో అజ్ఞాత జీవితం కొనసాగించాడు.ఆనాటి నుండి చనిపోయే వరకు అనేక ఆటుపోట్లను శత్రువుల దాడులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డాడు .ఫలితంగా ఆదివాసి ప్రజలకు లింగన్న పై ఎనలేని ప్రేమానురాగాలు పెరిగాయి.మబ్బుకొండల్లో ,కీకారణ్యంలో ,నదిలోయలో, జల ప్రవాహంలో అర్ధరాత్రి చల్లని వెన్నెలలో అందమైన పువ్వులు చూస్తూ మెత్తని పానుపు పై నడుస్తున్నంత ఖుషిగా పచ్చని పొదల మధ్య గులకరాళ్ళపై సాగుతున్న నీ సాయుధ దళంపై 2019 జూలై 31న కసాయి పోలీసు ముకాలు ఉదయం 6 గంటలకు ఏకపక్షంగా కాల్పులు జరిపి నీ ప్రయాణాన్ని అడ్డుకున్నారు .కానీ అది గ్రహించలేకపోయింది నీ ప్రయాణాన్ని అడ్డుకుంటే వేలమంది జనం ప్రతిఘటిస్తారని ,అది ఊహించలేకపోయింది ఎగిరే పావురాన్ని నేలరాలిస్తే ప్రజల నుండి వచ్చే తీవ్ర ప్రతిఘటనను .నేడు మితవాదం ,మతోన్మాదం పాసిస్తూ జాతీయంకార మిలిటరీ శక్తులు రాజకీయరంగం మీదికి వస్తున్నాయి. అడవి ప్రాంతాల్లోని అపారమైన ఖనీజ సంపదపై ,మానవ వనరులపై సామ్రాజ్యవాద బహుళ జాతి సంస్థల కేంద్రీకరణ పిచ్చి పరుగు వేగవంతమైన తరుణంలో మూలవాసులపై సామూహిక అత్యాచారాలు, అత్యాకాండలు ,క్రూరమైన దాడులు పెరిగాయి. వారి సమిష్టి జీవన విధానం సాంస్కృతిపై సామ్రాజ్యవాద, బ్రాహ్మణీయ ,భూస్వామ్య విష సంస్కృతి దాడి తీవ్రమైంది. మూలవాసులు తమ జీవనాధారాన్ని కోల్పోవడమే గాక సాంస్కృతి పరాయికరణకు బలవుతున్నారు .తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కానీ మూలిగే నక్క మీద తాటికాయ బడ్డట్లు జంతువుల జోను, హరితహారం, అడవి రక్షణ, జంతువుల రక్షణ, అభివృద్ధి పేర్లతో ఆదివాసులను అడవుల నుండి వెళ్ళగొట్టుటకు దేశ బార్డర్లోని సైన్యాన్ని అడవీ ప్రాంతాల్లో మొహరించి విధ్వంస అభివృద్ధి చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన మారిందేమీ లేదు. నిత్యం ఏదో ఒక చోట తుపాకి శబ్దం ,మరణం, రక్తం చిందని ప్రాంతం లేదు .ఆపరేషన్ కగారు పేరుతో వందలాది అమాయక ఆదివాసులను హత్యలు చేస్తున్నారు. ప్రశ్నించే వారిని నిర్బంధిస్తున్నారు. ప్రజల గొంతు నొక్కి వేస్తున్నారు .ప్రజల కోసం పోరాడుతున్న వాళ్లను ఎన్కౌంటర్లు చేస్తున్నారు. వారి సమాధుల వద్ద తల్లుల రోదన చూసి కవి శి వసాగర్ పేర్కొన్నట్లు అమ్మ అలా ఎందుకు ఏడుస్తావు నీలో నీవే కుమిలి కుమిలి ఎందుకు ఏడుస్తావు .ఆ సమాధిలో నువ్వు పెంచిన నీకోసం పోరాడిన కొడుకు లేడు అప్పుడే అతడు ఒళ్ళు విరుచుకొని సమాధి నుండి లేచి ఆయుధం చేత బట్టి తిరిగి రణరంగంలో చేరాడు. అమ్మ కళ్ళు తుడుచుకొని ఆశీర్వదించు పోరాటాన్ని అంటాడు .నేడు పాలకులు ఎంతమందిని హత్య చేసిన వారి ఆశయాలను హత్య చేయలేరు. పీడిత ప్రజలు విముక్తి పోందే వరకు సమసమాజ నిర్మాణం ఏర్పడే వరకు వారి మార్గం చిరస్థాయిగా కొనసాగుతూనే ఉంటుంది .జులై నెలలో అమరులైన విప్లవోద్యమ సిద్ధాంతకర్తలు కామ్రేడ్ చారుమజుంద ర్ కా,,తరిమెలనాగిరెడ్డి కా,,మధుసూదన్ రాజ్ యాదవ్, పంజాబ్ తొలి తరం విప్లవకారుడు కామ్రేడ్ పూజా సింగ్ తదితర వేలాదిమంది అమరవీరులకు విప్లవ జోహార్లు.
