పాస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్
Thovva web news.in//25,sun,1;45.pm

భారతదేశంలో ఓబీసీలకు రిజర్వేషన్ల లో జరుగుతున్న అన్యాయం కేవలం జనగణన చేయక పోవడమే ప్రధాన కారణమని పాస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగాని మల్లేశ్వర్ అభిప్రాయపడ్డారు. ఆదివారం హనుమకొండ లోని కాకతీయ యూనివర్సిటీ, మహాత్మ జ్యోతిరావు ఫూలే ప్రాంగణములో బీపీ మండల్ 106వ జయంతి సందర్భంగా పూలే ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలే ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని బీపీ మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఓబీసీలు విద్యా , ఉద్యోగ రంగాల్లో అనుభవిస్తున్న రిజర్వేషన్లు నాడు బీపీ మండల్ చైర్మన్ గా ఉన్నప్పటివేనని కొనియాడారు. వెనుకబడిన తరగతులకు జరుగుతున్న అన్యాయాన్ని అనేక రకాల అధ్యయనాల ద్వారా 1980లో 40 అంశాలతో కూడిన నివేదికను ఇవ్వడం జరిగింది. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్, బిజేపి ప్రభుత్వాలు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేక సంవత్సరాల పాటు కాలాయపనతో అమలుకు నోచుకోలేదు. తదుపరి వచ్చిన విపి.సింగ్ ప్రభుత్వం విద్య , ఉపాధి రంగాల్లో 27శాతం రిజర్వేషన్లు అమలు చేసింది.ఓబీసీల జనగణన చేయకుండా జాప్యం చేస్తున్న బిజేపి ప్రభుత్వానికి కనువిప్పు కల్గించే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు నిచ్చారు.ఈ కార్య క్రమంలో పాస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ తాడురి శాస్త్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ నల్లాని శ్రీనివాస్, జిల్లా నాయకులు డాక్టర్ పెద్ద బోయిన వెంకటయ్య, డాక్టర్ వంగాల సుధాకర్, కంజర్ల నర్సింహరాములు, మోటే చిరంజీవి, డాక్టర్ శంకర్, సురేందర్, నీలం ప్రనూప్, తదితరులు పాల్గొన్నారు.
