సెప్టెంబర్ 30 తో పాత పాలసీలు క్లోజ్ ….
ప్రీమియం సరెండర్ లో మార్పులు ….
ఇప్పుడు తీసుకుంటేనే పాలసీధారులకు ఉపయోగం అంటున్న ఆర్థిక నిపుణులు….
Thovva web news.in //11.sep.2024.wed.7:pm

ప్రపంచ వ్యాప్త ఇన్సూరెన్స్ దిగ్గజం ఎల్ఐసి పాలసీలలోసరికొత్త మార్పులు తీసుకురావడానికి సమయుతమైనట్టు తెలుస్తుంది గతంలో ఉన్న పాలసీల స్థానంలో కొత్త పాలసీలను తీసుకువచ్చి మార్పులకు శ్రీకారం చుట్టబోతుంది దీంతో ప్రీమియం సరెండర్ ఇతర అంశాలను పాలసీదారుకు ఉపయోగకరంగా లేదా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ యాక్ట్ ప్రకారం. మార్పులు చేర్పులు చేయబోతున్నట్లు తెలుస్తుంది ప్రైవేట్ కంపెనీలకు దీటుగా . షేర్ మార్కెట్ పాలసీలను కూడా తీసుకొచ్చే అవకాశం ఉందని గతంలో ప్రైవేట్ కంపెనీలు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి వాటి లాభ నష్టాలు కస్టమర్ల నెత్తిన రుద్దేవని. అలాంటి నిర్ణయాలు ఎల్ఐసి కొంత జాగ్రత్తగా వ్యవహరించి పాలసీదారుల సొమ్మును భద్రంగా ఉంచడానికి ప్రభుత్వ రంగా సంస్థల్లోని పెట్టుబడులను పెట్టేది. పోటీ ప్రపంచంలో ప్రైవేట్ కంపెనీలు దు దరిమిలా గతంలో మనీ ప్లస్ మార్కెట్ ప్లస్ ఇలాంటి పాలసీలను తీసుకువచ్చి ప్రజలకు ఉపయోగకరంగా చేయాలని ప్రయత్నించిన షేర్ మార్కెట్ కుదేలు కావడంతో ఆ ప్రయత్నం కుదరలేదు. ప్రజలకు ఉపయోగపడే ఎండోమెంట్ పాలసీల వైపే ఎల్ఐసి ఎక్కువ ముగ్గు చూపుతో వచ్చింది. ప్రస్తుతం ఎండోమెంట్ పాలసీలైన జీవన్ ఆనంద్, ఎండోమెంట్ జీవన్ లాబ్ , జీవన్ లక్ష్య జీవన్ ఉమాంగ్, జీవన్ ఉత్సవ్ లాంటి పథకాలను సెప్టెంబర్ 30 కల్లా మార్చి అక్టోబర్ నుంచి నూతన పాలసీ విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న విశ్వసనీయ సమాచారం….

పాలసీలు ఇప్పుడు తీసుకుంటేనే లాభం…ఆర్థిక నిపుణులు …. నాగభూషణ్…
ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నిటికంటే మేలైనటువంటి ఎల్ఐసి తన పథకాలను ఈ సెప్టెంబర్ కల్లామార్చి కొత్త పాలసీలకు రూపకల్పన చేస్తున్న ఆలోచన తో పాలసీ దారులకు ఎప్పుడు కొత్త పాలసీ తీసుకుంటే మంచిది అనే విషయం పై ప్రముఖ ఆర్థిక నిపుణులు నాగభూషణ్ రావు గారు వివరిస్తూ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ లో నైన గత పాలసీ విధానం ఇప్పుడు వున్న పాలసీ విధానం భేరీజు వేసుకుంటే గతంలో వున్న పాలసీలలో అధిక మొత్తంలో బోనస్ రేటు ఉండేదని ప్రస్తుతం ఉన్న పాలసీలలో కొంతమేరకు తగ్గిన విషయం గమనించవచ్చని అదేవిధంగా ఇప్పుడున్న పాలసీలు రేపు తీసుకునీ వచ్చే పాలసీ లు ఒకే విధంగా పాలసీదారులకు లాభసాటిగా ఉండే అవకాశాలు తక్కువగా ఉండొచ్చు గతంలో ఎల్ఐసి తీసుకువచ్చిన జీవన్ శ్రీ పాలసీలు జీవన్ రక్ష బీమా కిరణ్ లాంటి పాలసీలు పాలసీదారులకు లాభాలు చేసిన మని అలాంటి లాభాలు చేసిన పాలసీలు ఇప్పుడు తక్కువ అని రాబోయే పాలసీలలో కూడా అలాంటివి ఉండకపోవచ్చని అందుకే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పాలసీదారులు కొత్తగా తీసుకోవాల్సి వస్తే ఇప్పుడు తీసుకుంటేనే లాభం ఉంటుందని తెలిపారు.


